బిగ్బాస్ విన్నర్ కౌశలే.. లేదంటే ధర్నాలే : రష్మి
on Aug 23, 2018
బిగ్బాస్ రియాలిటీ షో రెండో సీజన్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.. రెండో సీజన్, మొదటి సీజన్ కి చాలా భిన్నంగా నడుస్తోంది.. మొదటి సీజన్లో విన్నర్ ఎవరని ఊహించటం చాలా కష్టమైంది.. కానీ రెండో సీజన్ అలాకాదు.. వన్ మాన్ షో నడుస్తోంది.. కౌశల్ ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో కొందరు సందడి చేస్తున్నారు.. ఆ సందడి చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ విన్నర్ కౌశలే అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.. మరికొందరు మాత్రం అసలు బిగ్బాస్ కంటెస్టెంట్ కి ఇంతమంది ఫ్యాన్స్, ఇలా ఆర్మీ అంటూ హడావుడి ఎలా సాధ్యమంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కొందరు సెలెబ్రిటీలు కూడా కౌశలే విన్నర్ అని బల్లగుద్ది చెప్తున్నారు.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ రష్మి బిగ్ బాస్ గురించి, కౌశల్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. 'బిగ్బాస్ చూడను కానీ వింటూ ఉంటాను.. అందులో చాలా మంది నాకు తెలిసినవాళ్లున్నారు.. గీత నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్.. నేను బిగ్బాస్ ఫాలో అవను.. అసలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.. ఇక్కడ ఏదైనా జరిగిందో లేదో వెంటనే ఇన్స్టాగ్రాంలో, ట్విటర్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.. కౌశల్ ఆర్మీని ట్విట్టర్లో చూస్తుంటా.. ఇప్పుడు చూసినంత వరకూ వన్సైడెడ్గా అయిపోయింది.. కౌశలే విన్ అవుతాడని అనిపిస్తోంది.. కౌశల్ ఆర్మీ అని చూస్తుంటాం.. కౌశల్ ఆర్మీ చాలా చాలా స్ట్రాంగ్.. చాలా ఫీడ్స్, పోస్ట్స్, వీడియోస్ చేసి పెట్టడం చూస్తుంటే వన్సైడెడ్గా అనిపిస్తోంది.. కౌశల్ ఒకవేళ గెలవకపోతే ధర్నాలు అయిపోతాయి’ అని రష్మి అన్నారు.