హాట్ యాంకరమ్మ కోరిక తీరింది
on Dec 10, 2014
'జబర్దస్త్’ కామెడి షో తో హాట్ యాంకర్ గా పేరుపొందిన అనసూయ, ఇప్పుడు బుల్లితెరపై ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ లో కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్న ఈ భామ, అనేక ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. గత కొంతకాలంగా వెండితెరపై కూడా మెరవాలని కలలుకంటున్న ఈ యాంకరమ్మ కోరిక లేటెస్ట్ గా తీరినట్టు సమాచారం. అడవి శేష్ ప్రధాన పాత్రలో పివిపి బ్యానర్ రూపొందిస్తున్న థ్రిల్లర్ సినిమాలో అనసూయను ఓ కీలక రోల్ కోసం ఎంపిక చేసినట్టు సమాచారం. ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి ‘క్షణం’ అనే టైటిల్ ను ఫైనల్ చేశారని తెలిసింది. మరి వెండితెరపై అనసూయ ఆశిస్తున్న బ్రేక్ ని ఈ సినిమా ఇస్తుందో..లేదో!!