అనసూయ భయపడింది.. మొత్తం తీసేసింది..!!
on Feb 7, 2018
అందం, చలాకీతనంతో బుల్లితెరపై స్టార్ యాంకర్గా వెలుగొందుతూనే.. వెండితెరపైనా తళుక్కున్న మెరుస్తూ.. షార్ట్ పీరియడ్లోనే స్టార్ సెలబ్రెటీగా మారిపోయింది అనసూయ. పర్సనల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఫ్యామిలీ అప్డేట్స్తో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఈ అమ్మడు. అలాంటి అనసూయ తన ట్విట్టర్, ఫేస్బుక్ ఎకౌంట్లను ఉన్నపళంగా డిలేట్ చేసింది. సెల్ఫీ దిగేందుకు తన వద్దకు వచ్చిన చిన్నారితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు.. వారి ఫోన్ పగలగొట్టడంతో అనసూయపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
జరిగిన సంఘటనపై క్లారిటీ ఇచ్చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నా.. నెటిజన్లు శాంతించడం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో అనసూయ దురుసు ప్రవర్తనకు తాను ప్రత్యక్ష సాక్షిని అంటూ.. ఒక యువకుడు ముందుకు రావడంతో విమర్శల దాడి మరింత ఎక్కువైంది. ఇక తాను ఎంత చెప్పినా వినేదారి కనిపించకపోవడంతో అనసూయ హర్ట్ అయ్యింది. ఈ అవేశంలో ట్వీట్టర్తో పాటు ఫేస్బుక్ ఖాతాలను డిలీట్ చేసింది. మధ్యాహ్నం సమయంలో అనసూయ కోసం సోషల్ మీడియాలో వెతికిన వారికి ఆమె జాడ కనిపించలేదు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావటం వల్లే అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
