'అల్లుడు అదుర్స్'.. 90 శాతం పూర్తి!
on Dec 22, 2020
'రాక్షసుడు' రూపంలో కెరీర్ లో తొలిసారి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. 'అల్లుడు అదుర్స్'లో నటిస్తున్నాడు. 'కందిరీగ', 'రభస', 'హైపర్' చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో సాయిశ్రీనివాస్ కి జంటగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తోంది. అను ఇమ్మాన్యుయేల్ మరో నాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ప్రకాష్ రాజ్, సోనూ సూద్ కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు 90 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. త్వరలోనే బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. అలాగే వచ్చే ఏడాది ఆరంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'అల్లుడు అదుర్స్'కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ డెబ్యూ మూవీ 'అల్లుడు శీను'కి కూడా తనే స్వరకర్త కావడం గమనార్హం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
