ENGLISH | TELUGU  

అమెరికాలోని టాంపా నగరానికి చీఫ్ గెస్ట్ అల్లు అర్జున్!.

on May 21, 2025

అమెరికా(America)లో ఉన్న తెలుగు వాళ్ళందరు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) పేరుతో ప్రతి సంవత్సరం తెలుగు సంబరాలని అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. గత ఏడేళ్లుగా ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పలువురు సినీ నటులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ తమ స్పీచ్ తో ఈ వేడుకకి మరింత వన్నె తెస్తుంటారు. ఈ క్రమంలోనే 2025 కి సంబంధించిన సంబరాలు జూలై 4 నుంచి 6 వరకు ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా(Tampa)నగరంలో ఉన్న టాంపా కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్నాయి.

ఈ  వేడుకలకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నాడు.ఇప్పుడు ఈ న్యూస్ అక్కడ ఉన్న తెలుగు వారిలో ఎనలేని ఉత్సాహాన్ని తెస్తుంది. ఈ క్రమంలో అల్లుఅర్జున్  ఏం మాట్లాడబోతున్నాడనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. వెంకటేష్, రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, మెహర్ రమేష్, థమన్, వివేక్ ఆత్రేయ, కావ్య థాపర్, మానస చౌదరి, సాయికుమార్ తో పాటు మరికొంత మంది నటీనటులు, దర్శకులు ఈ ఈవెంట్ లో  పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది.    అల్లుఅర్జున్ సినిమాల విషయానికి వస్తే  ప్రీవియస్ మూవీ 'పుష్ప 2 'విజయం ఇచ్చిన జోష్ తో తన తదుపరి చిత్రాన్ని 'అట్లీ' డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంతవరకు తెరకెక్కని సరికొత్త 'కథాంశంతో' ఈ చిత్రం తెరకెక్కబోతుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి కూడా అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ మూవీని సన్ పిక్చర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తుండగా జులై చివరి వారంలో,లేదా ఆగస్టు మొదటి వారంలో గాని షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.