అల్లు ఇంట తీవ్ర విషాదం.. హైదరాబాద్ బయల్దేరిన బన్నీ, చరణ్!
on Aug 29, 2025

అల్లు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ మాతృమూర్తి, అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అర్ధరాత్రి దాటాక అంటే 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. (Allu Kanakaratnam)
అల్లు కనకరత్నమ్మ అల్లు అర్జున్ కి నాయనమ్మ, రామ్ చరణ్ కి అమ్మమ్మ అవుతారు. ప్రస్తుతం షూటింగ్ కోసం బన్నీ ముంబైలో ఉండగా, చరణ్ మైసూర్ లో ఉన్నాడు. ఈ విషాద వార్త తెలిసి వారు అక్కడి నుంచి వెంటనే బయల్దేరారు. ఇద్దరూ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు.
కనకరత్నమ్మ అంత్యక్రియలు మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో జరగనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



