న్యూ ఇయర్ రోజు సస్పెన్స్ వీడనుంది!!
on Dec 29, 2018

`నా పేరు సూర్య` సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఈ క్రమంలో బన్ని తన తదుపరి సినిమా కోసం చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఎట్టకేలకు తదుపరి చిత్రాన్ని న్యూ ఇయర్ రోజున ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమాకు డైరక్టర్ ఎవరన్నది సస్సెన్స్ గా మారింది. ఇన్ని రోజులు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్ని సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఇటీవల చిరంజీవి ...త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడంటూ స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలో అయితే బన్నితో త్రివిక్రమ్ సినిమా లేనట్టేనా? అన్న సందేహం మొదలైంది.
అయితే ఈ క్రమంలో మరో వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే గీతా ఆర్ట్స్ లో `గీతా గోవిందం` చిత్రం చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన పరశురామ్ తన తదుపరి సినిమా మళ్లీ గీతా ఆర్ట్స్ లోనే చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఎప్పటి నుంచో బన్ని కోసం కథ సిద్ధం చేస్తోన్నాడు పరశురామ్. మరి న్యూ ఇయర్ రోజు బన్ని ప్రకటించే సినిమాకు త్రివిక్రమ్ డైరక్టరా? లేక పరశురామ్ డైరక్టరా? అన్న సందేహంలో అందరూ ఉన్నారు. ఏది ఏమైనా ఆ రోజు సస్పెన్స్ వీడనుంది. వెయిట్ అండ్ సి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



