ఈ కవిత చాలు పవన్ ఫ్యాన్స్ ఊగిపోవడానికి
on Dec 19, 2017
సినిమాలతో కాకుండా వ్యక్తిత్వంతో జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్న నటులు భారత చలన చిత్ర రంగంలో అరుదు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలిచే స్టార్, పవర్స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ఎక్కువగా ఎవరితో మాట్లాడరని.. చాలా రిజర్వ్డ్గా ఉంటారని అందరి అభిప్రాయం.. కానీ కళ్యాణ్తో ఒక్కసారి మాట్లాడితే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటారు సినీ జనాలు.
ఈ లిస్ట్లో చాలా మంది సెలబ్రిటిలు ఉన్నారు.. కొందరు బయటపడుతుంటారు.. కొందరు లోపల దాచుకుంటారు అంతే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్. తాజాగా పవన్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి. అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ వేడుకకి హాజరైన భరణి పవన్ కళ్యాణ్పై రాసిన కవితను చదివి వినిపించారు. "అతగాడు మితభాషి నిత్య సత్యాన్వేషి అర్జునుని వంటి ఒక అజ్ఞాతవాసి" అని అనగానే పవన్ ఫ్యాన్స్ చప్పట్లతో ఆడిటోరియాన్ని మారుమోగించారు.