అడివి శేష్ 'పరేషాన్'?
on Mar 8, 2019
జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న యువ హీరోల్లో అడివి శేష్ ఒకరు. 'క్షణం', 'గూఢచారి' విజయాలతో అడివి శేష్ అంటే ప్రేక్షకుల్లో ఓ నమ్మకం ఏర్పడింది. అతడి కంటూ ఒక ఇమేజ్, ఒక మార్కెట్ వచ్చాయి. యాక్షన్ థ్రిల్లర్స్ అతడికి పేరు తీసుకొచ్చాయి. అందుకు తగ్గట్టు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం 'మేజర్' సినిమా చేస్తున్నాడు అడివి శేష్. దీనికి మహేష్ బాబు ఒక నిర్మాత. 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి అమరుడైన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. దీని తరవాత కూడా అడివి శేష్ ఓ థ్రిల్లర్ సినిమా చేయనున్నాడని టాక్. అడివి శేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి పివిపి సినిమా సంస్థ సన్నాహాలు చేస్తోంది. 'మేజర్' పూర్తి అయిన తరవాత ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 'క్షణం' తరవాత పివిపి సినిమా, అడివి శేష్ కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. దీనికి 'పరేషాన్' టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఇటీవల ట్ టైటిల్ ను పివిపి సంస్థ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించింది. 'క్షణం' తరహాలో ఇదీ ఓ మర్డర్ మిస్టరీ అని టాక్.