కన్నీళ్లు పెట్టిస్తున్న ఏఎస్ రవికుమార్ చౌదరి చివరి మాటలు
on Jun 11, 2025
యజ్ఞం, పిల్లనువ్వులేని జీవితం, వీరభద్ర, ఆటాడిస్తా, సౌఖ్యం వంటి చిత్రాలతో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు ఏఎస్ రవికుమార్ చౌదరి(As Ravi kumar Chowdary). నిన్నరాత్రి చౌదరి కార్డియాడిక్ అరెస్ట్ కి లోనవ్వడంతో చనిపోవడం జరిగింది. దీంతో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు చౌదరి మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.
ఇక చౌదరి ప్రముఖ ఛానల్ 'తెలుగువన్'(TeluguOne)కి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'నా సినీ జర్నీ కొంచం స్లో అయ్యిందిగాని ఇంకా ముగియలేదు. ఫ్యూచర్ లో ఇంకా మంచి సినిమాలు తెరకెక్కించి . మంచి పొజిషన్ లో ఉంటాను. ఇప్పటికిప్పుడే ఒక మనిషిని ఎనాలసిస్ చెయ్యకూడదు. టార్గెట్ రీచ్ అయ్యాక ఎనాలసిస్ చెయ్యాలి. అంతే కానీ మధ్యలోనే చెయ్యకూడదు. నా ఎదుటి వాళ్ళు ఢిల్లీ వెళ్లాలని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో వెళ్లారు. నేను తెలియక పాసెంజర్ ఎక్కాను. ఈ విషయం తెలుసుకోడానికి నాకు కొంత టైం పట్టింది. దీంతో ఈ సారి హెలికాఫ్టర్ ఎక్కి వాళ్ళ కంటే ముందుంటాను. సచిన్ టెండ్యూలర్ డక్ అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ సెంచరీలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. పివి సింధు ఒక చోట ఓడిపోతుంది, మరో చోట గెలుస్తుంది. ఇట్స్ ఏ గేమ్ ఆఫ్ ది లైఫ్. నా భవిషత్తు ఏంటో మీకు తెలుసా. ఇప్పుడు నెక్స్ట్ చెయ్యబోయే సినిమా హీరో ఎవరుంటారో తెలుసా, ఎన్ని కోట్ల బడ్జెట్ మూవీనో తెలుసా అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
