2022 ప్రథమార్ధం.. మల్టిస్టారర్ మయం!
on Jan 24, 2022
2022 ప్రథమార్ధం తెలుగునాట ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ప్రస్తుతం టాలీవుడ్ లో రూపొందుతున్న క్రేజీ మల్టిస్టారర్స్ అన్నీ ఈ క్యాలెండర్ ఇయర్ ఫస్టాఫ్ నే టార్గెట్ చేసుకున్నాయి. సంక్రాంతికి రిలీజైన కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య ఫ్యామిలీ మల్టిస్టారర్ `బంగార్రాజు` విజయపథంలో పయనిస్తున్న నేపథ్యంలో.. రాబోయే బహుకథానాయకుల చిత్రాలపై ఒకసారి ఫోకస్ చేస్తే..
ఆర్ ఆర్ ఆర్ః- యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందిన ఫిక్షనల్ పిరియడ్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ క్రేజీ మల్టిస్టారర్.. కుదిరితే మార్చి 18న లేదా ఏప్రిల్ 28న థియేటర్స్ లోకి రాబోతోంది.
ఆచార్యః- మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన సోషల్ డ్రామా `ఆచార్య`. విజనరీ డైరెక్టర్ కొరటాల శివ తీర్చిదిద్దిన ఈ ఫ్యామిలీ మల్టిస్టారర్.. ఏప్రిల్ 1న సమ్మర్ స్పెషల్ గా సిల్వర్ స్క్రీన్ పై ఎంటర్టైన్ చేయనుంది.
భీమ్లా నాయక్ః- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి కాంబినేషన్ లో వస్తున్న మల్టిస్టారర్ `భీమ్లా నాయక్`. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్ గా సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. ఫిబ్రవరి 25న జనం ముందుకు రానుంది.
ఎఫ్ 3ః- 2019 సంక్రాంతి విజేత `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం `ఎఫ్ 3`. విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లోనే అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మల్టిస్టారర్ ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమైంది.
మరి.. తక్కువ గ్యాప్ లోనే రానున్న ఈ మల్టిస్టారర్స్ లో వేటికి ప్రజాదరణ దక్కుతుందో చూడాలి.