Home

»

Latest News

బ‌ర్త్ డే స్పెష‌ల్: ర‌వితేజ‌కి గోల్డెన్ ఇయ‌ర్ అదే!

Jan 26, 2022 9:39AM

క‌థానాయ‌కుడిగా మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్ లో ఎన్నో విజ‌యాలున్నాయి. అయితే, ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో వ‌రుస‌గా మూడు విజ‌యాలు అందుకున్న వైనం మాత్రం ఒక‌టే ఉంది. వాటిలో రెండు సినిమాలు ఒకే నెల‌లో రిలీజ‌వ్వ‌డం విశేషం.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. 1999లో విడుద‌లైన `నీ కోసం` చిత్రంతో సోలో హీరోగా మారిన ర‌వితేజ‌.. 2001లో రిలీజైన `ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం`తో క‌థానాయకుడిగా మొద‌టి సూప‌ర్ హిట్ చూశారు. ఇక 2002 సంవ‌త్స‌రం అయితే ర‌వితేజ‌కి గోల్డెన్ ఇయ‌ర్ అనే చెప్పాలి. జ‌స్ట్ 120 రోజుల వ్య‌వ‌ధిలో మూడు మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ చూశారు మాస్ మ‌హారాజా. ఆ చిత్రాలే.. `ఔను.. వాళ్ళిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు`, `ఇడియ‌ట్`, `ఖ‌డ్గం`.  

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వంశీ తెర‌కెక్కించిన `ఔను.. వాళ్ళిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు` 2002 ఆగ‌స్టు 2న తెర‌పైకి రాగా.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తీర్చిదిద్దిన `ఇడియ‌ట్` 2002 ఆగ‌స్టు 22న సిల్వ‌ర్ స్క్రీన్ పైకి వ‌చ్చింది. ఇక క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణవంశీ రూపొందించిన మ‌ల్టిస్టార‌ర్ `ఖడ్గం`  న‌వంబ‌ర్ 29న సంద‌డి చేసింది. ఇందులో శ్రీ‌కాంత్, ప్ర‌కాశ్ రాజ్ తో క‌లిసి న‌టించారు ర‌వితేజ‌. మొత్త‌మ్మీద‌.. ఒకే ఏడాదిలో ఇలా త‌క్కువ గ్యాప్ లోనే హీరోగా మూడు విజ‌యాలు చూసి వార్త‌ల్లో నిలిచారు ర‌వితేజ‌. వీటిలో `ఇడియ‌ట్` చిత్రమైతే త‌న కెరీర్ ని మేలిమ‌లుపు తిప్పిన సినిమాగా నిలిచింది. మొత్తంగా.. ర‌వితేజ‌కి 2002 గోల్డెన్ ఇయ‌ర్ అనే చెప్పాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com