2017 లో కనిపించకుండా పోయిన తారలు
on Dec 25, 2017
నూతన సంవత్సరానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది. 2017 టాలీవుడ్ కి మిశ్రమ ఫలితాల్ని ఇచ్చింది. కొందరు కొత్తగా పరిచయం అయి తమకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకుంటే, ఇంకొందరు తారలు ఈ ఏడాది పూర్తిగా కనిపించకుండా పోయారు. ఆ లిస్ట్ ఏంటో చూద్దామా!
1. త్రిష:
2016 లో నాయకి తో అటు నిర్మాతల్ని, ఇటు ప్రేక్షకుల్ని భయపెట్టిన త్రిష, 2017 లో ఒక్క తెలుగు సినిమాలో కూడా చేయలేదు. తనతో పాటు, ఇండస్ట్రీ కి వచ్చిన శ్రియ శరన్, కాజల్ అగర్వాల్ లాంటి వాళ్ళు ఈ ఏడాది మంచి హిట్లు కొడితే, త్రిష మాత్రం తెలుగులో ఆఫర్లు లేక తమిళ్లో చిన్నా, చితకా సినిమాలు చేసింది.
2. నిత్యా మీనన్:
తెలుగులో ఉన్న అతి కొద్ది పర్ఫార్మర్స్ లో నిత్యా మీనన్ ఒకరు. చేసింది కొన్ని సినిమాలే అయినా, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లో అయితే, ఏకంగా హీరోల్ని డామినేట్ చేసే పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అలాంటి నిత్యా మీనన్ 2017 లో ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. విజయ్ తమిళ్ సినిమా మెర్సల్ లో చిన్న రోల్ చేసిన నిత్యా మీనన్, తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చినా నచ్చక తిరస్కరించిందని సమాచారం.
3. కృతి సనన్:
మహేష్ బాబు 1 నేనొక్కడినే తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. బాలీవుడ్ లో మంచి ఆఫర్లు పట్టేసి, తెలుగు పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది. అయినా, తెలుగు నిర్మాతలు కూడా కృతి పైన అంత ఇంటరెస్ట్ చూపించలేదట, ఎందుకంటే నేనొక్కడినే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
4. ప్రణీత సుభాష్:
మంచు మనోజ్ సరసన చేసిన డైనమైట్ ప్రణీత సుభాష్ కి తెలుగు లో చివరి సినిమా. ఇక్కడ హిట్లు పెద్దగా లేకపోవడంతో, తెలుగు ఫిలిం మేకర్స్ ప్రణీత గురించి ఆలోచించడం మానేశారు.
5. నయనతార:
లేడీ బాస్ గా పేరు తెచ్చుకున్న నయనతార, తమిళ్ సినిమా పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అందుకే, ఈ సంవత్సరం తెలుగులో ఒక్క రిలీజ్ కూడా లేదు. బాలకృష్ణ జై సింహ చిత్రంలో ప్రధాన నాయికగా చేస్తుంది నయన్, కానీ ఈ సినిమా 2018 సంక్రాంతి కి విడుదలవుతుంది.