ENGLISH | TELUGU  

అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్‌... కేసు వాపస్‌ తీసుకుంటానంటున్న మృతురాలి భర్త!

on Dec 13, 2024

సంధ్య థియేటర్‌లో డిసెంబర్‌ 4న జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై గత పదిరోజులుగా చర్చ జరుగుతోంది. ఆ మహిళ మృతికి అల్లు అర్జునే బాధ్యుడని, అతన్ని అరెస్ట్‌ చెయ్యాలన్న డిమాండ్స్‌ సర్వత్రా వినిపించాయి. ఈ క్రమంలోనే శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు జూబ్లీ హిల్స్‌లోని అల్లు అర్జున్‌ నివాసానికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కి తరలించి అతని స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసుకొని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అతన్ని నాంపల్లి కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ కోర్టులో జరుగుతోంది. మరో పక్క అల్లు అర్జున్‌ వేసిన స్క్వాష్‌ పిటిషన్‌పై కూడా విచారణ జరుగుతోంది. పోలీసుల నివేదిక పరిశీలించిన న్యాయమూర్తి అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్‌ను విధించారు. అతను థియేటర్‌కి రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని భావించిన కోర్టు ఆ మహిళ మృతికి అతనే కారణమని తెలియజేసింది. 

ఇదిలా ఉంటే.. తాజాగా మృతురాలు రేవతి భర్త భాస్కర్‌.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై స్పందించాడు. తన కుమారుడు సినిమా చూడాలని కోరడం వల్లే ఇద్దరు పిల్లలతో కలిసి తను, రేవతి వెళ్ళామని తెలిపారు. అల్లు అర్జున్‌ అక్కడికి వస్తున్నారని తమకు తెలీదని, అయినా ఇందులో అతని తప్పేమీ లేదని అన్నారు. అవసరమైతే తాను కేసును వాపస్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా భాస్కర్‌ తెలిపారు. మరి దీనిపై పోలీసులుగానీ, కోర్టుగానీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.