కన్నీళ్లు పెట్టుకుంటు కొత్త వాగ్దానం చేసాడు
on Jan 20, 2025
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)ఇప్పుడంటే తన స్థాయికి తగ్గటుగా సినిమాలు తెరకెక్కించటం లేదు గాని,ఒకప్పుడు మాత్రం తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా సినిమాలు తెరకెక్కించేవాడు.వర్మ టేకింగ్ కి టెక్నాలజీ కి బాలీవుడ్ కూడా ఫిదా అయ్యింది.అందుకే వర్మ అక్కడ సుమారు ముప్పై చిత్రాల దాకా దర్శకత్వం వహించాడు.
వర్మ రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తు .సినిమా చిత్రీకరించడం అంటే బిడ్డకి జన్మనివ్వడంతో సమానం. కొన్ని రోజుల క్రితం నా దర్శకత్వంలో వచ్చిన సత్య మూవీని చూసాను.ఇలాంటి గొప్ప సినిమాని తెరకెక్కించింది నేనేనా అని ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి.ఇన్ని రోజులు కథ,కథనాలు లేకుండా అసభ్య కర సినిమాలు తెరకెక్కిస్తు తెలుగు సినిమాకి ఎంత ద్రోహం చేసానో అర్ధమయింది.ముందుకి బానిసనవ్వడంతో పాటు,అహంతో కళ్ళు నెత్తికెక్కి,ఎలాంటి సినిమా తెరకెక్కించినా,ప్రేక్షకులు చూస్తారని భావించి బూతు సినిమాలు తీసాను.ఇక నుంచి మంచి సినిమాలే తెరకెక్కిస్తాను.
ఈ విషయం 27 ఏళ్ళ తర్వాత సత్య సినిమా చూస్తే గాని అర్ధం కాలేదు.సత్య సినిమా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.నా జీవితంలో ఇంకా సగ భాగం మాత్రమే మిగిలివుంది.ఈ సగ భాగంలో మంచి సినిమాలని ప్రేక్షకులకి అందిస్తానని సత్య సినిమా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాని 'ఎక్స్' వేదికగా తెలియచేసాడు.శివ,రంగీలా,క్షణక్షణం,అనగనగాఒక రోజు,అంతం,గోవిందా గోవిందా,రాత్రి,గాయం,దౌడ్,సర్కార్ ,జంగిల్,మస్త్,కంపెనీ,ఆగ్,రక్ష,రక్త చరిత్ర వంటి పలు విభిన్న సినిమాలు వర్మ నుంచి వచ్చాయి

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
