బాలకృష్ణ మీద తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కీలక వ్యాఖ్యలు!
on Apr 20, 2024
నందమూరి కుటుంబంలో దివంగత నటుడు నందమూరి తారకరత్నకి చాలా ప్రత్యేకత ఉంది.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కర్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాడు. వరల్డ్ సినిమా చరిత్రలోనే ఒకేసారి 9 సినిమాలకి బుక్ అయిన హీరోగా కూడా రికార్డు సృష్టించాడు. గత సంవత్సరం ఫిబ్రవరి లో అనారోగ్య కారణాలతో చనిపోయాడు. రీసెంట్ గా ఆయన సతీమణి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్ అండ్ కొన్ని వ్యాఖ్యలు టాక్ అఫ్ ది డే గా నిలిచాయి
తారకరత్న భార్య పేరు అలేఖ్య రెడ్డి. వారిరువురిది ప్రేమ వివాహం. బాలకృష్ణ, మోక్షజ్ఞ లతో కలిసి తన పిల్లలు దిగిన ఫోటోని అలేఖ్య ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు అది నందమూరి అభిమానుల్లో ఎనలేని ఆనందాన్ని తీసుకొస్తుంది. ఎలాంటి కల్మషం లేని చిరునవ్వుతో తారకరత్న కుటుంబానికి నేనున్నాను అంటు బాలయ్య పిల్లల మీద చేయి వెయ్యడం నందమూరి అభిమానులని ఆకట్టుకుంటుంది. వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ గా కూడా ఉండిపోనుంది. ఇదే టైం లో బాలకృష్ణ ని ఉద్దేశించి అలేఖ్య కొన్ని వ్యాఖ్యలు చేసింది. నేను ఎటు వైపు ఉంటానని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా మా కుటుంబం వైపే ఉంటాను. ఏ విధమైన అంశాలు గురించి ఆశించకుండా మా మామయ్య గారికి విష్ చేస్తున్నాను అని చెప్పింది. దీంతో ఆమె ఈ ఎన్నికల్లో బాలకృష్ణ కి సపోర్ట్ ఇస్తుందనే విషయం అర్ధం అవుతుంది.
ఇక తారకరత్న అంటే బాలకృష్ణ కి చాలా అభిమానం. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా చెప్పాడు.తారకరత్న చనిపోయినప్పుడు కూడా తానే దగ్గరుండి అన్ని చూసుకున్నాడు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ సినిమాల పరంగా చూసుకుంటే తన కొత్త మూవీని బాబీ డైరెక్షన్ లో చేస్తున్నాడు. బాలయ్య కెరీర్ లో అది 109వ చిత్రం.