SSMB 29 లో సీనియర్ స్టార్ హీరో!
on Jun 7, 2025
మహేష్(Mahesh Babu)రాజమౌళి(Ss Rajamouli)కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ, ఇప్పటికే తన మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకొని, త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ని జరుపుకోనుంది. 'ssmb 29 'అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అమెజాన్ అడవుల నేపథ్యంలో జరిగే అడ్వెంచర్ థ్రిలర్ గా ఉండనుంది. ప్రియాంక చోప్రా(Priyanka Chopra)హీరోయిన్ గా చేస్తుండగా, సలార్ ఫేమ్ పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో చేస్తున్నాడు. మొదటి షెడ్యూల్ లో మహేష్, ప్రియాంక, పృథ్వీ సుకుమారన్ పై కీలక సన్నివేశాలని చిత్రీకరించారు.
ఇప్పుడు ఈ మూవీలో 'మాధవన్' ఒక ముఖ్యమైన క్యారక్టర్ ని పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో జరగబోయే సెకండ్ షెడ్యూల్ లో మాధవన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారని, వీటన్నిటిపై త్వరలోనే అధికార ప్రకటన రానుందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. సఖి, చెలి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన మాధవన్, సుదీర్ఘ కాలం నుంచి బహుభాషా నటుడుగా రాణిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న పలు చిత్రాలతో పాటు, వెబ్ సిరీస్ లలో కూడా చేస్తు బిజీగా ఉన్నాడు.
ssmb 29 లో పలువురు విదేశీ నటులు కూడా నటించనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, మాధవన్ క్యారక్టర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. బాహుబలి, ఆర్ఆర్ ఆర్ ఫేమ్ విజయేంద్రప్రసాద్ కథని అందిస్తుండగా, దుర్గ ఆర్ట్స్ పతాకంపై కె ఎల్ నారాయణ కనివిని ఎరుగని బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కీరవాణి(Keeravani)సంగీత దర్శకుడు కాగా షూటింగ్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
