ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ ఇదే..మాస్ లకే మాస్
on Apr 29, 2025
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)ప్రశాంత్ నీల్(Prashanth neel)కాంబోలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని, హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మిస్తుంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమవ్వగా, ఎన్టీఆర్ పై కొన్నికీలక సన్నివేశాలని కూడా చిత్రీకరించారు.
రీసెంట్ గా మైత్రి సంస్థ మండుతున్న నిప్పుని డ్రాగన్ ఆకారంలో సింబాలిక్ గా ఉంచి, ఎన్టీఆర్,ప్రశాంత్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇద్దరు డైనమిక్ వ్యక్తుల కాంబినేషన్ లో బాక్స్ ఆఫీస్ విధ్వంసమయ్యే అనుభూతికి సిద్ధం కండి. జూన్ 25 2026 న థియేటర్స్ దద్దరిల్లే సౌండ్ మీరు వింటారు. మాస్ లకే మాస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ప్రత్యేక గ్లింప్స్ తో మీ ముందుకు వస్తామని ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ తో ఎన్టీఆర్ అభిమానుల్లో సరికొత్త జోష్ వచ్చినట్లయ్యింది. నిర్మాణ సంస్థ చెప్పినట్టుగా 2026 జూన్ 25 బాక్స్ ఆఫీస్ దద్దరిల్లడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. మే 20 న వచ్చే ఎన్టీఆర్ గ్లింప్స్ సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టడం ఖాయమనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు
.ఆర్ఆర్ఆర్, దేవర తో ఎన్టీఆర్ వరుస భారీ విజయాల్ని అందుకున్నాడు. కేజీఎఫ్, సలార్ తో ప్రశాంత్ నీల్ కి ఒక బ్రాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఎన్టీఆర్,ప్రశాంత్ మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఇక ఈ మూవీకి 'డ్రాగన్'(Dragon)అనే పేరు ప్రచారంలో ఉండగా ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్(Rukmini Vasanth)జోడి కట్టబోతుందనే ప్రచారం కూడా ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
