చరిత్ర సృష్టించిన మంచు మోహన్ బాబు, విష్ణు..ఇండియాలోనే మొదటి రికార్డు అంట
on May 16, 2025
మంచు విష్ణు(Vishnu)మోహన్ బాబు(Mohanbabu)ల ప్రెస్టేజియస్ట్ మూవీ కన్నప్ప(kannappa). పరమేశ్వరుడి' పరమ భక్తుడైన 'కన్నప్ప' జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రభాస్ (prabhas)మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి మేటి నటులు కీలక పాత్రలు పోషిస్తుండంతో ఈ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. కన్నప్ప భార్యగా ప్రీతి ముకుందన్ చేస్తుండగా మహాభారతాన్ని తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar singh)దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. జూన్ 27 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఇక మంచు మోహన్ బాబుకి చెందిన ఎంబియు(మోహన్ బాబు యూనివర్సిటీ) బాధ్యతల్ని విష్ణు చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ యూనివర్సిటీ ద్వారా ఇండియాకి ఫారిన్ ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకు వచ్చేందుకు విష్ణు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తు వస్తున్నాడు. ఈ క్రమంలో 'పెన్ యూనివర్సిటీతో ఎంబీయూ టై అప్ అయ్యింది. ఈ విషయాన్నీ 'ఎక్స్' వేదికగా తెలియచేసిన విష్ణు 'ఇండియాలో ఫారిన్ ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకురాబోతోన్నాం,పెన్ యూనివర్సిటీతో ఎంబీయూ టై అప్ అయింది.. ఇది ఇండియాలోనే మొదటి సారి, చరిత్ర సృష్టించామని ట్వీట్ వేశాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
