తెలుగు వాళ్లే నా కొంప ముంచారు..నార్త్ లో బయటపెట్టిన ఇలియానా
on May 1, 2024
నా అంతట నేను తెలుగు సినిమాల నుంచి తప్పుకోలేదు. కేవలం వాళ్ళ వల్లే తప్పుకోవాల్సివచ్చింది. నా మీద అంతటి రూమర్స్ ని క్రియేట్ చేసారు. ఇప్పుడు ఈ మాటలన్నీ దశాబ్దంన్నర క్రితం తెలుగు సినిమాని ఒక ఊపిన ఇలియానా చెప్తుంది. టాక్ అఫ్ ది డే గా నిలిచింది
ఇలియానా నటించిన ధో ఔర్ ధో ప్యార్ అనే హిందీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తెలుగు సినిమా నుంచి ఎందుకు సడన్ గా తప్పుకోవాల్సి వచ్చిందో వివరించింది. 2012 లో రవితేజ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన దేవుడు చేసిన మనుషులులో నటించింది. అదే సంవత్సరం హిందీలో బర్ఫీ అనే మూవీ చేసింది. రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా లాంటి భారీ కాస్ట్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో కొంత మంది తెలుగు దర్శక, నిర్మాతలు ఇలియానా ఇక తెలుగు సినిమాలు చెయ్యదనే రూమర్స్ ని స్ప్రెడ్ చేసారు. దాంతో ఎవరు తన దగ్గరకి రాలేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం పై సోషల్ మీడియాలో రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పైగా ముంబైలో ఎక్కువ భాగం ఉండటం వల్ల అక్కడే సెటిల్ అయిపోయానని అనుకున్నారని కూడా చెప్పుకొచ్చింది.
ఇలియానా 2006 లో దేవదాస్ అనే చిత్రంతో పరిచయం అయ్యింది. ఆ సినిమా హిట్ కావడంతో అవకాశాలు వెతుక్కుంటు వచ్చాయి. పోకిరి,జల్సా , రాఖి, జులాయి, కిక్ లాంటి భారీ హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి 30 చిత్రాల దాకా చేసింది. కన్నడ సినిమాలోని ఒక సాంగ్ లో గెస్ట్ అప్పీరియన్స్ కూడా ఇచ్చింది.అమెరికా కి చెందిన మైకేల్ డోలాన్ అనే పాప్ సింగర్ ని వివాహం చేసుకుంది. ఇటీవలే ఇద్దరకీ ఒక కొడుకు కూడా పుట్టాడు