12 ఏళ్ళ తర్వాత గోపీచంద్ సాహసం.. హిట్ కొడతాడా?
on Apr 24, 2025
కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న మాచో స్టార్ గోపీచంద్ (Gopichand).. అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటికే 'ఘాజి' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించాడు. తాజాగా మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ బ్యానర్ లో 'సాహసం'(2013) వంటి విభిన్న చిత్రంతో మెప్పించాడు గోపీచంద్. 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ చిత్రం, గురువారం (ఏప్రిల్ 24) నాడు అధికారికంగా ప్రారంభమైంది.
బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. థ్రిల్లింగ్ కథాంశంతో, హై టెక్నికల్ స్టాండర్డ్స్తో ఈ చిత్రం రాబోతోందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో మలయాళ నటి మీనాక్షి దినేష్ కథానాయికగా నటించనుంది. సినిమాటోగ్రాఫర్ గా శామ్దత్ వర్క్ చేయనున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
