ఒకే సినిమాలో బాలకృష్ణ, నాగార్జున..!
on May 27, 2025
రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'కూలీ' సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కూలీ' తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ చేస్తున్న 'జైలర్-2'లో సైతం నాగార్జున నటిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా మెయిన్ విలన్ గా అని సమాచారం.
ఇటీవల నాగార్జున సోలో హీరో కంటే కూడా ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. జూన్ 20న విడుదల కానున్న 'కుబేర'లో ధనుష్ తో కలిసి నటించాడు. అదే బాటలో రజినీకాంత్ తో 'కూలీ' చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తమిళ మేకర్స్ దృష్టి నాగార్జునపై పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 'జైలర్-2'లో విలన్ రోల్ కోసం డైరెక్టర్ నెల్సన్ రీసెంట్ గా నాగార్జునను సంప్రదించినట్లు వినికిడి. నాగార్జున సైతం ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్లు టాక్.
అయితే ఇక్కడ ఇంకో విశేషముంది. 'జైలర్'లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ప్రత్యేక పాత్రల్లో మెరిశారు. అలాగే 'జైలర్-2'లో బాలకృష్ణ కనువిందు చేయనున్నారని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఇక ఇప్పుడు విలన్ గా నాగార్జున నటించనున్నారనే వార్త మరింత ఆసక్తికరంగా మారింది. అదే నిజమైతే.. ఒకే సినిమాలో బాలకృష్ణ, నాగార్జున కనిపించడం ఇదే మొదటిసారి అవుతుంది. గతంలో వెంకటేష్ హీరోగా వచ్చిన 'త్రిమూర్తులు' సినిమాలో పలువురు యాక్టర్లతో కలిసి ఒక సాంగ్ లో బాలయ్య, నాగ్ కూడా తళుక్కున మెరిశారు. కానీ, అవి రోల్స్ కావు. జస్ట్ అలా కనిపిస్తారంతే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
