రాముడికి నోటీసులు
on May 9, 2024
పాన్ ఇండియా లెవల్లో అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకొంటున్న మూవీ రామాయణ. బాలీవుడ్ లో నిర్మాణం జరుపుకుంటున్నా కూడా రాముడు అందరి వాడు కాబట్టి మూవీపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఎలాంటి అనౌన్సుమెంట్ లేకుండానే షూటింగ్ ని జరుపుకుంటుంది.ఇప్పుడు ఈ మూవీని ఆపండి అని నోటీసులు వెళ్లాయి
అల్లు అరవింద్..తెలుగు చిత్ర సీమలో ఉన్న బడా నిర్మాతల్లో ఒకరు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై 1974 నుంచి సినిమాలు నిర్మించుకుంటు వస్తున్నారు. దాదాపుగా అన్ని కూడా విజయవంతమైన చిత్రాలే. బాలీవుడ్ లో కూడా అమీర్ ఖాన్ తో గజని ని నిర్మించాడు. ఇప్పుడు ఈయనే రామాయణ కి నోటీసులు పంపించారు .సినిమా షూటింగ్ ముందుకు వెళ్లకూడదని నోటిసుల్లో స్పష్టంగా ఉంది. మధు వంతెన అనే ఒక పార్టనర్ తో కలిసి అరవింద్ రామాయణ ని గతంలో అనౌన్సుమెంట్ చేసారు. ఆ మేరకు స్క్రిప్ట్ ని కూడా రెడీ చేయించారు.ప్రైమ్ టెక్నాలజీ అనే సంస్థ కూడా వారితో భాగస్వామ్యం అయ్యింది. అలాంటిది ఆ ఇద్దరి అనుమతి లేకుండా ప్రైమ్ టెక్నాలజీనే రామాయణ ని తెరకెక్కిస్తోంది. అందుకే నోటీసులు పంపించారు. షూటింగ్ కి ముందుకు వెళ్తే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు
ఇక రామాయణ లో బాలీవుడ్ అగ్ర నటుడు రణబీర్ కపూర్ రాముడు గా, సీతగా సాయి పల్లవి చేస్తుంది. దీంతో అందరిలోను మూవీ మీద ఆసక్తి నెలకొని ఉంది. పైగా రావణుడుగా కెజిఎఫ్ తో యష్ చేస్తుండంతో మూవీ కి వెయ్యి టన్నుల బలం వచ్చినట్టయ్యింది. మిగతా క్యారక్టర్ ల గురించి అధికార ప్రకటన అయితే రాలేదు గాని అన్ని భాషలకి చెందిన భారీ నటులే ఇందులో నటిస్తున్నారు. నితీష్ తివారి,రవి ఉదయార్ లు కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మూవీకి సంబంధించిన కొన్ని స్టిల్స్ కూడా బయటకి వచ్చాయి.కాకపోతే వాటిని యూనిట్ మాత్రం రిలీజ్ చెయ్యలేదు