నటసింహ తాండవం మొదలైంది.. ‘అఖండ2’ టీజర్ అదిరింది!
on Jun 9, 2025
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని మరోసారి చూసేందుకు రంగం సిద్ధమైంది. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అఖండ2’ టీజర్ విడుదలైంది. జూన్ 10 నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. టీజర్లోనే సినిమా ఎంత భారీగా ఉండబోతోంది, ఆడియన్స్ని థ్రిల్స్ చేసే ఎలిమెంట్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయి అనేది చూపించారు. అఘోరా గెటప్లో వున్న బాలయ్య.. గన్లతో ఉన్న ఎనిమిది మందిని తన త్రిశూలంపై మోసుకొని వస్తూ ‘నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా..’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నందమూరి బాలకృష్ణ చెప్పిన డైలాగ్ థియేటర్స్లో విజిల్స్ వేయించేలా ఉంది. ఆ వెంటనే ఒక్కసారిగా వారిని నేలకు విదిలించి కొడతారు. ఆ తర్వాత తన త్రిశూలాన్ని మెడపై తిప్పుతుండగా దుండగుల మెడలు తెగిపోతూ ఉంటాయి. ఈ సీన్ను బోయపాటి శ్రీను తన స్టైల్లో ఎంతో ఎఫెక్టివ్గా తీశారు. టీజర్ చివరలో ‘వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది’ అంటూ ఎంతో డెప్త్తో ఉన్న డైలాగ్ ఉంటుంది. విజువల్గా ఈ సీన్ను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ‘అఖండ2’ తాండవంతో సెప్టెంబర్ 25న థియేటర్లు దద్దరిల్లిపోయే రేంజ్లో బాలకృష్ణ తన నట విశ్వరూపాని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టీజర్తో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోతున్నాయి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘అఖండ2’ సెకండ్ హ్యాట్రిక్కి శ్రీకారం చుడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
