చేసింది మూడు సినిమాలు... అంత పారితోషికమా?
on Jul 18, 2017
మొన్నటి దాకా హీరోల పారితోషికాల గురించి అందరూ మాట్లాడుకునేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుతం రెమ్యునరేషన్ల విషయంలో దర్శకులదే హవా అని చెప్పాలి.
ప్రస్తుతం పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నది ఎవరు? అంటే టక్కున వచ్చే సమాధానం ‘ఎస్ ఎస్ రాజమౌళి’. ఆయన పారితోషికం ఎంతో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ‘బాహుబలి’సిరీస్ కి 50 కోట్ల వరకూ పారితోషికంగా రాజమౌళీ తీసుకున్నట్లు టాక్. ఇప్పుడున్న హీరోల్లో ఎవరూ తీసుకోనంత రెమ్యునరేషన్ అది.
ఇప్పుడు రాజమౌళీ తర్వాత అందరూ మరో దర్శకుని పారితోషికం గురించి మాట్టాడుకుంటున్నారు. ఆయనే ‘కొరటాల శివ’. మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ విజయాలతో హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన శివ... ప్రస్తుతం మహేశ్ తో ‘భరత్ అను నేను’చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమా చేయబోతున్నారు కొరటాల. మైత్రీ మూవీమేకర్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల తీసుకుంటున్నా పారితోషికం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అక్షరాలా 14 కోట్ల రూపాయలు పారితోషికం ఈ సినిమాకు కొరటాల శివ తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విధంగా రాజమౌళి తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకునిగా కొరటాల శివ రికార్డ్ సృష్టించారు.