మరోసారి చిరంజీవితో తమన్నా..!!
on Sep 24, 2021

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ మూవీ 'వేదాళం'కి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో.. చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ మూవీలో చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుందని టాక్ వినిపిస్తోంది.
చిరంజీవి పుట్టినరోజు(ఆగష్టు 22) సందర్భంగా 'భోళా శంకర్' మూవీ అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అదే రోజు రాఖీ కూడా కావడంతో చిరంజీవికి కీర్తి సురేష్ రాఖీ కడుతున్న పోస్టర్ ను విడుదల చేసి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. అయితే ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు ఈ మూవీలో చిరంజీవి సరసన తమన్నా నటించనుంది అంటూ న్యూస్ వినిపిస్తోంది. గతంలో 'సైరా'లో చిరంజీవితో కలిసి తమన్నా స్క్రీన్ షేర్ చేసుకుంది. మరి ఈ జోడీ మరోసారి ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.
కాగా, కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'ఆచార్య' విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 'గాడ్ ఫాదర్'లో నటిస్తున్నారు. ఆ తర్వాత 'భోళా శంకర్', డైరెక్టర్ బాబీ ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



