'సలార్' సినిమాలో రాకీ భాయ్.. ఫ్యాన్స్ కి పూనకాలే!
on Jun 29, 2022
'బాహుబలి' ఫ్రాంచైజ్ తో టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారినట్లుగానే 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తో కన్నడ స్టార్ యశ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు ఈ ఇద్దరు సౌత్ స్టార్స్ కి నేషనల్ వైడ్ గా క్రేజ్ ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది?. త్వరలోనే ఆ అద్భుతం జరిగే అవకాశముందని అంటున్నారు.
'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'సలార్' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్' తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు, ప్రభాస్ నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు యశ్ రూపంలో ఈ సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్ తోడు కానుందని తెలుస్తోంది.
'సలార్' సినిమాలో యశ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన ప్రశాంత్ నీల్ కోసం గెస్ట్ రోల్ చేయడానికి యశ్ వెంటనే ఓకే చెప్పినట్లు టాక్. అదే నిజమైతే ఒకే స్క్రీన్ పై ప్రభాస్, యశ్ లను చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదేమో. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో కేజీఎఫ్ లోనే చూశాం. అలాంటిది ప్రభాస్, యశ్ లను ఒకే స్క్రీన్ పై ప్రశాంత్ నీల్ చూపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సలార్ లో నిజంగానే రాకీ భాయ్ గెస్ట్ లో దర్శనమిస్తాడో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.