వస్తే తీసుకునేవారు కాదా! పోతే బాధెందుకు?
on Jan 22, 2018
‘అజ్ఙాతవాసి’ విషయంలో బయ్యర్లకు ఎదురైన నష్టాన్ని గురించి... పవర్ స్టార్ స్పందిచిన తీరుపై.. ఫిలిం సర్కిల్స్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చలే. ఈ సినిమా ఊహించని స్థాయిలో బయ్యర్లకు నష్టాన్ని తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. అయితే... వారందరూ నిర్మాత రాధాకృష్ణను కలిసి గోడు విన్న వించుకున్నారట.
నిర్మాత ఎస్.రాధాకృష్ణకు పరిశ్రమలో మంచి గుడ్ విల్ ఉన్న నిర్మాత. సాత్వికుడు, మంచివాడుగా ఆయనకు పేరు. తన సినిమా వల్ల బయ్యర్లకు ఎదురైన నష్టాన్ని ఎలా అయినా తీర్చాలన్ని ఆయన నిర్ణయించుకున్నారట. ఇదే విషయంపై పవన్ కల్యాణ్ ని ఆయన కలిశారట.
అందరం పూనుకుంటే... బయ్యర్లకు ఎదురైన నష్టాలను కొంతైనా పూడ్చొచ్చన్న తన అభిప్రాయాన్ని పవన్ ముందుంచారట.
అయితే.. ఈ వ్యవహారంపై పవన్ విభిన్నంగా స్పందించినట్లు ఫిలింనగర్ టాక్. ‘మీ ‘అ ఆ’ సినిమా హిట్ అయ్యింది కదా. అప్పుడు అందరికీ లాభాలొచ్చాయ్ కదా. మరి వేమైనా తిరిగిచ్చారా? ఇప్పుడు నష్టాలొస్తే ఎందుకు తిరిగివ్వాలి?’ అని వపర్ స్టార్ అనడంతో రాధాకృష్ణ షాకయ్యారట. అంతేకాదు...‘ నేను నా అభిమానులకు మాత్రమే తలొంచుతా. బయ్యర్లకు తలొంచాల్సిన అవసరం నాకు లేదు. సినిమా జయాపజయాలు దైవాధీనాలు. అందుకు సిద్ధపడే కొన్నారు. డబ్బులొస్తే.. బాగానే పోగేసుకునేవారుగా... అలాగే... ఫ్లాప్ అయినా భరించాలి. నా రెమ్యునరేషన్ వెనక్కిచ్చే పనిలేదు’ అని పవన్ తేల్చి చెప్పినట్టు ఫిలింనగర్ టాక్.
మరి నిజానిజాలు దేవుడికే తెలియాలి? అయినా పవన్ అన్న మాటలో కూడా నిజం లేకపోలేదు. ఏమంటారు ఫ్రెండ్స్?