సలార్.. విలన్ ఫిక్స్ అయ్యాడా?
on Feb 8, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల్లో విలన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యముంటుంది. వర్షం, ఛత్రపతి, మిర్చి, బాహుబలి సిరీస్.. ఇలా ప్రభాస్ ప్రతీ బ్లాక్ బస్టర్ మూవీలోనూ కథానాయకుడి పాత్రకి దీటుగా ఉండే ప్రతినాయక పాత్రలే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే.. ప్రభాస్ కెరీర్ లో మరో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ లో విలన్ గా ఎవరు నటిస్తున్నారు? అన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు ఈ జాబితాలోకి చేరగా.. తాజాగా శాండల్ వుడ్ లో విలన్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న మధు గురుస్వామి పేరు వెలుగులోకి వచ్చింది. మఫ్టీ లాంటి చిత్రాలతో మధుకి కన్నడనాట నటుడిగా మంచి గుర్తింపు దక్కింది. తెలుగు చిత్రం సాక్ష్యంలోనూ ఓ విలన్ గా దర్శనమిచ్చాడు. ప్రభాస్ కటౌట్ కి సరిపడేలా ఉంటాడనే నమ్మకంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇతని వైపే మొగ్గు చూపిస్తున్నాడట. త్వరలోనే సలార్ లో మధు ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
సలార్ లో ప్రభాస్ కి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. 2022 సంక్రాంతికి ఈ పాన్ ఇండియా మూవీ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముందని టాక్.