విజయ్ దేవరకొండ సరసన కృతి శెట్టి!
on Dec 5, 2022
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఖుషి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో సెకండ్ హీరోయిన్ రోల్ కూడా ఉందట. ఈ పాత్ర కోసం యంగ్ బ్యూటీ కృతి శెట్టిని సంప్రదించినట్లు తెలుస్తోంది.
'ఉప్పెన'(2021)తో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. వరుస అవకాశాలు ఆమెను చుట్టుముట్టాయి. అయితే ఈ ఏడాది వరుస పరాజయాలు పలకరించడంతో ఆమె జోరు కాస్త తగ్గింది. ప్రస్తుతం ఆమె నాగ చైతన్య సరసన 'కస్టడీ'లో నటిస్తోంది. అలాగే ఓ మలయాళ చిత్రం చేస్తోంది. ఇక ఇప్పుడు ఆమెకు విజయ్ సరసన 'ఖుషి'లో నటించే అవకాశం వచ్చినట్టు న్యూస్ వినిపిస్తోంది. సెకండ్ హీరోయిన్ పాత్ర అయినప్పటికీ, ఇది సినిమాకి కీలకమైన పాత్ర కావడంతో కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
