ENGLISH | TELUGU  
Home  » Gossips

చరణ్, కొరటాల కాంబోలో పాన్ ఇండియా మూవీ!

on Feb 7, 2022

'ఆచార్య' సినిమా తర్వాత డైరెక్టర్ కొరటాల శివ వరుస పాన్ ఇండియా సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన తెరకెక్కించనున్న పాన్ ఇండియా మూవీ త్వరలో పట్టాలెక్కనుంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో కూడా కొరటాల ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నారని తెలుస్తోంది.

చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆచార్య'. రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 29 న విడుదల కానుంది. ఇక మార్చి 25 న 'ఆర్ఆర్ఆర్'తో ప్రేక్షకులను పలకరించనున్న తారక్.. తన తర్వాతి సినిమా కొరటాల దర్శకత్వంలో చేయనున్నాడు. 'జనతా గ్యారేజ్' తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత 'ఆర్ఆర్ఆర్'లో నటించిన మరో స్టార్ చరణ్ తో కూడా కొరటాల సినిమా చేయనున్నారని టాక్.

చరణ్-కొరటాల కాంబినేషన్ లో గతంలోనే ఓ సినిమా రావాల్సి ఉండగా అది కార్యరూపం దాల్చలేదు. అయితే 'ఆచార్య'లో చరణ్ కీలక పాత్రలో నటించడంతో వీరి కాంబినేషన్ లో సినిమా చూడాలనుకున్న ఫ్యాన్స్ కోరిక కొంత నెరవేరనుంది. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ రానుందన్న న్యూస్ ఆసక్తికరంగా మారింది. చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత శంకర్, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్స్ లైన్స్ ఉన్నాయి. వీటి తర్వాత చరణ్-కొరటాల కాంబోలో సినిమా వచ్చే అవకాశముంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.