ఆగస్టు 11, 2017న టాలీవుడ్లో ఏం జరగబోతోంది..?
on Apr 5, 2017
మీరు టైటిల్ చూసి ఏదేదో ఊహించుకోకండి. ఆ రోజు పెద్ద ప్రమాదమో, లేక ఇంకేదో ముంచుకు రావడం లేదు..ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. అంతే..జనతా గ్యారేజ్ తర్వాత బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ "జై లవ కుశ" అనే సినిమా చేస్తున్నాడు..దీనిని తారక్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రజంట్ శరవేగంగా జరుగుతోంది..ఈ మూవీని ఆగస్టు 11న రిలీజ్ చేస్తామని కళ్యాణ్ రామ్ అనౌన్స్ చేశాడు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ సినిమాను సైలెంట్గా స్టార్ట్ చేశాడు పవన్..గత రెండు రోజుల నుంచి ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది..దీనిని కూడా ఆగస్టు 11న రిలీజ్ చేయాలనుకుంటున్నాడు పవన్.
హను రాఘవపూడి-నితిన్ కాంభినేషన్లో వస్తున్న మూవీని కూడా అదే రోజున రిలీజ్ చేస్తారట..ఇంతకీ ముగ్గురు స్టార్ హీరోల కన్ను ఆ రోజు మీద ఎందుకు పడిందంటే..ఆ రోజు శుక్రవారం, ఆతర్వాత వీకెండ్ అంతేకాదు సోమవారం శ్రీకృష్ణాష్టమీ, మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం ఇలా వరుసగా నాలుగు రోజులు సెలవులు కావడంతో వాటిని క్యాష్ చేసుకోవడానికి స్టార్స్ స్కెచ్ గీస్తున్నారు. ప్రస్తుతానికి వీరు మాత్రమే సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటుండగా..రానున్న రోజుల్లో ఇంకెంత మందికి ఆగస్టు 11 కావాలో వేచి చూడాలి.