జూనియర్ బెల్లంకొండతో కృతి శెట్టి?
on May 17, 2021
క్రేజీ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న యువ కథానాయికల్లో కృతి శెట్టి ఒకరు. బ్లాక్ బస్టర్ మూవీ `ఉప్పెన` తరువాత నేచురల్ స్టార్ నానితో `శ్యామ్ సింగ రాయ్`, సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది ఈ మంగళూరు బ్యూటీ. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇవన్నీ కూడా స్ట్రయిట్ మూవీస్ నే.
కట్ చేస్తే.. త్వరలో తొలిసారిగా ఓ రీమేక్ లో సందడి చేయనుందట కృతి. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన `వివాహ్` (2006) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. తన చిన్న కొడుకు బెల్లంకొండ సాయిగణేశ్ ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించనున్న ఈ సినిమాలో కృతి శెట్టిని నాయికగా నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే `వివాహ్` రీమేక్ పై, కృతి ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
కాగా, షాహిద్ కపూర్ - అమృతా రావ్ జంటగా సూరజ్ బర్జత్యా దర్శకత్వంలో రాజశ్రీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన `వివాహ్`.. తెలుగులోనూ `పరిణయం` పేరుతో అప్పట్లో అనువాదమైంది. మళ్ళీ 15 ఏళ్ళ తరువాత రీమేక్ వార్తలతో ఈ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెలుగులోకి రావడం విశేషం.