SSMB29 : ఒక్క సెట్ కి 50 కోట్లు ఏంటి సామి..!
on Jun 20, 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా కోసం ఏకంగా రూ.50 కోట్లతో ఓ భారీ సెట్ వేశారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.
రాజమౌళి సినిమా సినిమాకి తన బ్రాండ్ ను పెంచుకుంటున్నాడు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ వైడ్ గా సత్తా చాటిన రాజమౌళి.. ఇప్పుడు మహేష్ సినిమాతో మరింత సౌండ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇది ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోంది. ఇక ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం రామోజీ ఫిలిం సిటీలో పురాతన వారణాసి సెట్ చేశారట. ఈ సెట్ కోసం ఏకంగా రూ.50 కోట్లు ఖర్చయినట్లు సమాచారం.
SSMB29 సినిమా ఇండియానా జోన్స్ తరహా కథతో రూపుదిద్దుకుంటోంది. రాజమౌళి తన గత సినిమాలకు భిన్నంగా జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ కెన్యాలో జరగనుంది. ఫారెస్ట్ నేపథ్యంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కిస్తారని తెలుస్తోంది. దీని తర్వాత వారణాసి సెట్ లో షూటింగ్ జరిగే అవకాశముంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
