కళ్యాణ్ రామ్ హీరోయిన్ మారింది
on May 26, 2015

ఒకే సారి రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళాడు కళ్యాణ్ రామ్. పటాస్, షేర్. ఇందులో పటాస్ విడుదలై మంచి విజయాన్ని సాధించింది. మరో వైపు 'షేర్' షూటింగ్ కూడా వేగంగా సాగుతుంది. ఈ చిత్రంలో వన్య మిశ్ర ను కధానాయికగా ఎంపిక చేశారు. కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అయితే సడన్ ఈ చిత్రం నుండి ఆమెను తప్పించారని, మిశ్ర ప్లేస్ లో సోనాల్ చౌహాన్ ని రీ ప్లేస్ చేస్తున్నారని వినిపించింది. నిజమే.. ఈ చిత్రంలో మిశ్రాను ను తప్పించేశారు. ఈ ఆఫర్ ను సోనాల్ చౌహాన్ దృవీకరించింది. ''కళ్యాణ్ రామ్ షేర్ కు సైన్ చేశా. ఇదో మంచి కమర్షియల్ ఇంటర్ ట్రైనర్' అని చెప్పుకొచ్చింది సోనాల్. కళ్యాణ్ రామ్ తో కత్తిని తెరకెక్కించిన మల్లికార్జున రావు ఈ చిత్రానికి దర్శకుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



