'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్.. తగ్గేదేలే!
on Nov 30, 2021
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' మూవీ ప్రీరిలీజ్ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఆ సమయంలో మహేష్ మాట్లాడుతూ 'మేం మేం బానే ఉంటాం.. మీరే ఇంకా బాగుండాలి' అంటూ ఫ్యాన్స్ కి సూచించాడు. అయినప్పటికీ కొందరి ఫ్యాన్స్ లో మార్పు రావట్లేదు. అయితే ఇటీవల కాలంలో హీరోలు ఒకరి మూవీ ఈవెంట్ లో మరొకరు పాల్గొని ఫ్యాన్స్ మధ్య దూరం తగ్గించి మనమంతా ఒక్కటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశాడు. అంతేకాదు తానొక స్టార్ అయ్యుండి కూడా 'జై బాలయ్య' అంటూ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపాడు. ఇలా హీరోలు ఏ మాత్రం ఈగోలకు పోకుండా అందరి సినిమాలు ఆడాలని కోరుకుంటూ ఒక పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక త్వరలో జరగనున్న పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ లోనూ ఇదే రిపీట్ సీన్ కానుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ హాజరు కానున్నాడని ప్రచారం జరుగుతోంది. పుష్ప పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. ఈ ఈవెంట్ లో సందడి చేస్తే సినిమాకి బోలెడంత ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో మేకర్స్ ఇలా ప్లాన్ చేసారని తెలుస్తోంది. బన్నీ, ప్రభాస్ ల మధ్య మంచి బాండింగ్ ఉంది. గతంలో పలు వేడుకల్లో బన్నీ, ప్రభాస్ సందడి చేశారు. ఇప్పుడు పుష్ప ఈవెంట్ తో మరోసారి సందడి చేయనున్నారని టాక్.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న పుష్ప మూవీలో బన్నీకి జోడిగా రష్మిక నటిస్తోంది. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భగం డిసెంబర్ 17న విడుదల కానుంది. డిసెంబర్ 12 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Also Read