పరశురామ్ - కీర్తి సురేశ్.. మరోసారి!?
on May 28, 2022
`సర్కారు వారి పాట` తరువాత దర్శకుడు పరశురామ్ - కథానాయిక కీర్తి సురేశ్ మరోసారి జట్టుకట్టనున్నారా!? అవునన్నదే టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతోంది. 14 రీల్స్ ప్లస్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుంది. `నాగేశ్వరరావు` అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా.. మిడిల్ క్లాస్ నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందట. కాగా, ఈ చిత్రంలో నాగచైతన్యకి జంటగా కీర్తి సురేశ్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అదే గనుక నిజమైతే.. ఇప్పటివరకు తన చిత్రాల్లో ఏ కథానాయికని కూడా రిపీట్ చేయని పరశురామ్.. కీర్తి సురేశ్ తో రెండోసారి పనిచేయబోతున్నట్లే. త్వరలోనే చైతూ - పరశురామ్ సినిమాలో కీర్తి సురేశ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, ఇంతకుముందు కీర్తి సురేశ్ టైటిల్ రోల్ లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `మహానటి`లో తన తాత అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కాసేపు మెరిశాడు నాగచైతన్య. అలాంటి ఈ ఇద్దరి కలయికలో ఓ పూర్తి స్థాయి సినిమా రాబోతుండడం వార్తల్లో నిలిచే అంశమే. చూద్దాం.. ఏం జరుగుతుందో!?