‘అల్లుడు శీను’ కొత్త సినిమా ప్రారంభం
on Aug 27, 2014
నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు ‘అల్లుడు శీను’ రిలీజై ఇంకా నెల రోజులు కూడా దాటలేదు అప్పుడే మరో సినిమాకు ముహూర్తం జరిగింది. బోయపాటి శీను, బెల్లంకొండ శ్రీనివాస్ ల కొత్త సినిమా ఓపెనింగ్ భారీ స్థాయిలో జరిగింది. ఈ సినిమా ఓపెనింగ్లో సినీ ప్రముఖులు కె. రాఘవేంద్రరావు, వివి.వినాయక్, దిల్ రాజు పలువురు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. 'నా లవ్వు - నవ్వు జోలికొస్తే ఎవడూ మిగలడు' అనే డైలాగ్ పై ముహూర్తం షాట్ తీశారట. హీరోయిన్గా నటిస్తున్న తమన్నా షూటింగ్ లో బిజీగా వుండడంతో కార్యక్రమానికి హాజరుకాలేదు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్గా రూపొందే ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా రెగ్యులర్ షూట్ అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతుందని సమాచారం.