యాక్టింగ్ మానేసి ఇడ్లి, వడ అమ్ముకో
on May 12, 2025
బాలీవుడ్ కండల వీరుడుగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న నటుడు సునీల్ శెట్టి(Suiel Shetty). 1992 వ సంవత్సరంలో 'బల్వాన్'(Balwaan)అనే మూవీతో తెరంగ్రేటం చేసిన సునీల్ శెట్టి, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకుని పరిశ్రమ మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఆ తర్వాత హీరోగానే కాకుండా ,క్యారక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా ఎన్నో హిట్ చిత్రాల్లో అత్యద్భుతమైన పాత్రలని పోషిస్తు అభిమానులని, ప్రేక్షకులని తన నటనతో ఉర్రుతలూగిస్తు వస్తున్నాడు. ఈ నెల 23 న 'కేసరి వీర్'(Kesari Veer)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, వివేక్ ఒబెరాయ్, సూరజ్ పాంచోలి వంటి మేటి నటులు కీలక పాత్రలు పోషించారు. ప్రిన్స్ ధీమాన్, కనుభాయ్ చౌహాన్ ద్వయం దర్శకత్వంలో కేసరి వీర్ తెరకెక్కింది.
ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా సునీల్ శెట్టి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో ఆయన మాట్లాడుతు నా మొదటి సినిమా 'బల్వాన్ ' రిలీజ్ అయ్యాక ఒక సినీ విమర్శకుడు రివ్యూ రాసాడు. ఆ రివ్యూలో నా నటన గురించి ప్రస్తావిస్తు హీరో నటన చాలా దారుణంగా ఉంది. అతనికి నటన రాదు. స్క్రీన్ పై అలా చూస్తు ఉండిపోయాడు. ఇలాంటి వ్యక్తి సినిమాల్లో ఉండటం కంటే ఇడ్లీ, వడ అమ్ముకోవడం బెటర్ అని రాసారు. ఆ రివ్యూ రాసిన వ్యకికి తెలియని నిజం ఏంటంటే ఇడ్లి, వడ అమ్ముకోవడం వల్లే మా జీవనం కొనసాగింది. నేను నా సోదరీమణులు చదువుకోవడంతో పాటు మా కుటుంబం మంచి జీవన స్థితిలోకి వచ్చింది. 35 సంవత్సరాలు దాటినా నేనింకా సినిమాల్లో కొనసాగుతున్నానంటే మా హోటలే అందుకు కారణం. కౌంటర్ లోనే కాదు టేబుల్స్ శుభ్రపర్చి కిచెన్ లో వర్క్ చేసే వాడినని సునీల్ చెట్టి చెప్పుకొచ్చాడు.
కన్నడ రాష్ట్రానికి చెందిన సునీల్ శెట్టి తన కెరీర్ లో ఇప్పటి వరకు హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళ్, మరాఠీ, కన్నడ, ఆంగ్ల, టర్కిష్ భాషల్లో కలిపి దాదాపు 100 పైగా సినిమాల్లో నటించాడు. పలు ప్రతిష్టాత్మక అవార్డులని కూడా అందుకున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
