English | Telugu

నిర్మాత మృతి.. ఎమోషనల్ అయిన 'కార్తీకదీపం' హిమ!

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు సినీ ప్రముఖులు కరోనాతో మరణిస్తున్నారు. మరికొందరు అనారోగ్య కారణాల వలన మృతువాత పడుతున్నారు. తాజాగా బుల్లితెరపై తీవ్ర విషాదం నెలకొంది. జీతెలుగులో ప్రసారమయ్యే 'నెంబర్ వన్ కోడలు' సీరియల్ నిర్మాత హరీష్ మృతి చెందారు. దీంతో ఆ సీరియల్ యూనిట్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఆయన మరణవార్త విని షాక్ అయినట్లు సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తోన్న సుధా చంద్రన్ తెలిపారు.

ఉదయం లేవగానే షాకింగ్ న్యూస్ విన్నానని.. ప్రొడ్యూసర్ హరీష్ గారు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతూ మరణించారని.. ఇంకా ఎంతో జీవితాన్ని చూడాల్సిన ఆయన.. త్వరగా వెళ్లిపోయారని ఎమోషనల్ అయ్యారు. హరీష్ గారు ఎంతో తక్కువగా మాట్లాడతారని.. సహృదయులు అని చెప్పారు. "మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం." అంటూ సుధా చంద్రన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ గా రాసుకొచ్చారు.

'కార్తీకదీపం' ఫేమ్ హిమ (సహృద) సైతం సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సహృద నిర్మాత మరణంపై స్పందించింది. ''హరీష్ సర్ మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం. నన్ను మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. మీరు మా నుండి భౌతికంగా దూరమయ్యారేమో కానీ.. మా హృదయంలో ఎప్పుడూ మీరుంటారు. మిమ్మల్ని నిత్యం ప్రేమిస్తూనే ఉంటాం'' అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.