English | Telugu

నిర్మాత మృతి.. ఎమోషనల్ అయిన 'కార్తీకదీపం' హిమ!

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు సినీ ప్రముఖులు కరోనాతో మరణిస్తున్నారు. మరికొందరు అనారోగ్య కారణాల వలన మృతువాత పడుతున్నారు. తాజాగా బుల్లితెరపై తీవ్ర విషాదం నెలకొంది. జీతెలుగులో ప్రసారమయ్యే 'నెంబర్ వన్ కోడలు' సీరియల్ నిర్మాత హరీష్ మృతి చెందారు. దీంతో ఆ సీరియల్ యూనిట్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఆయన మరణవార్త విని షాక్ అయినట్లు సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తోన్న సుధా చంద్రన్ తెలిపారు.

ఉదయం లేవగానే షాకింగ్ న్యూస్ విన్నానని.. ప్రొడ్యూసర్ హరీష్ గారు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతూ మరణించారని.. ఇంకా ఎంతో జీవితాన్ని చూడాల్సిన ఆయన.. త్వరగా వెళ్లిపోయారని ఎమోషనల్ అయ్యారు. హరీష్ గారు ఎంతో తక్కువగా మాట్లాడతారని.. సహృదయులు అని చెప్పారు. "మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం." అంటూ సుధా చంద్రన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ గా రాసుకొచ్చారు.

'కార్తీకదీపం' ఫేమ్ హిమ (సహృద) సైతం సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సహృద నిర్మాత మరణంపై స్పందించింది. ''హరీష్ సర్ మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం. నన్ను మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. మీరు మా నుండి భౌతికంగా దూరమయ్యారేమో కానీ.. మా హృదయంలో ఎప్పుడూ మీరుంటారు. మిమ్మల్ని నిత్యం ప్రేమిస్తూనే ఉంటాం'' అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.