English | Telugu

వేద నిజాయితీని య‌ష్ నిరూపించ‌గ‌ల‌డా?

నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. బుల్లి తెర‌పై గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, బేబీ మిన్ను నైనిక‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ట్విస్ట్ లతో షాకిస్తూ ఆస‌క్తిక‌ర‌మ‌లుపులు తిరుగుతున్న ఈ సీరియ‌ల్ శుక్ర‌వారం ఎలా సాగ‌నుందో ఇప్పుడు చూద్దాం.

కైలాష్ త‌న‌ని వేధించాడ‌ని, ఓ అమ్మాయితో నాట‌కం ఆడించి త‌న‌ని పోలీస్టేష‌న్ లో పెట్టించాడ‌ని వేద చెబుతుంది. అయితే ఇదంతా క‌ట్టుక‌థ అని, కావాల‌నే త‌న భ‌ర్త మీద బుర‌ద జ‌ల్లుతోంద‌ని య‌ష్ సోద‌రి కంచు ఆరోపిస్తుంది. కైలాష్ నాట‌కం మొద‌లు పెట్టి వేద ఫోన్ నుంచి బూతు మెసేజ్ లు వ‌చ్చాయ‌ని దొంగ సాక్ష్యాలు చూపిస్తాడు. దీంతో కంచు మ‌రింత‌గా రెచ్చిపోయి వేద‌పై చేయి చేసుకోవ‌డ‌మే కాకుండా మ‌రింత నీచంగా మాట్లాడుతూ వేద‌ని వేధిస్తుంది. ఇంత జ‌రుగుతున్నా య‌ష్ క‌నీసం ప్ర‌త‌ఘ‌టించ‌డు..

ఇదే స‌మ‌యంలో వేద త‌ల్లి సులోచ‌న, తండ్రి వ‌ర‌ద‌రాజులు శ‌ర్మ ఎంట్రీ ఇస్తారు. త‌న కూతురిపై నేను బ్ర‌తికుండ‌గానే నింద‌వేస్తారా? అని సులోచ‌న ఆగ్ర‌హంతో ఊగిపోతుంది. నిప్పుని నిప్పు అని చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని త‌ప్పు ఎక్క‌డో జ‌రిగిందంటుంది. ఎవ‌డ్రా నువ్వు అంటూ కైలాష్ పై మండిప‌డుతుంది. కంచు క‌ల‌గ‌జేసుకుని వేద‌ని నిందిస్తుంటే మ‌ళ్లీ ఆ కూత కూస్తే చెప్పు తెగుతుంద‌ని వార్నింగ్ ఇస్తుంది. మ‌ధ్య‌లో మాలిని ఎంట‌రై సులోచ‌న‌ని బెదిరించే ప్ర‌య‌త్నం చేసినా సులోచ‌న లెక్క‌చేయ‌దు. కంచు ..వేద‌ని మెడ‌ప‌ట్టి బ‌య‌టికి గెంటేయ‌మ‌న‌డంతో సులోచ‌న మ‌రింత‌గా ఫైర్ అవుతుంది. అది చెప్పాల్సింది య‌ష్‌.. మిస్ట‌ర్ య‌శోధ‌ర్ చెప్పిండి అని నిల‌దీస్తుంది. య‌ష్ మాట్లాడ‌క‌పోవ‌డంతో ఒక్క క్ష‌ణం కూడా నా కూతురిని ఇలాంటి చెడిపోయిన వారి ఇంటిలో వుండ‌నివ్వ‌న‌ని వేద‌ని త‌న వెంట తీసుకెళుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? య‌ష్ మ‌న‌లో ఏముంది? కైలాష్ భ‌ర‌తం ప‌ట్టాడా? వేద నిజాయితీని నిరూపించాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.