English | Telugu

విజయ్ ఆంటోని మూవీ "భద్రకాళీ"లో రెండు సాంగ్స్ రాయడానికి భోలే షావలికి ఛాన్స్

విజయ్ ఆంటోని మూవీ "మార్గన్" టీమ్ తో ఏమంటా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చారో చాలా మందికి ఆఫర్స్ ఇచ్చారు ఆయన. జడ్జ్ ఇంద్రజ భోలే షావలి గురించి చాల మంచిగా చెప్పారు. వండర్ ఫుల్ లిరిక్ రైటర్ అని మంచి టాలెంట్ ఉన్న పర్సన్ అంటూ ఇంట్రడ్యూస్ చేశారు విజయ్ ఆంటోనీకి. "ఆయన ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ కంపోజర్ గా స్టార్ట్ చేసి ఫెంటాస్టిక్ ఆల్ రౌండర్ గా ఎంటర్టైన్మెంట్ అందిస్తారు" అని చెప్పారు. దాంతో విజయ్ ఆంటోని ఫుల్ ఖుషీ ఇపోయారు ఐతే "మీరు లిరిక్ రైటర్ ఐతే గనక నా రాబోయే సినిమా భద్రకాళి మూవీలో మీరు టు సాంగ్స్ రాయబోతున్నారు..ఇది నా ప్రామిస్" అని చెప్పారు. "భద్రకాళి మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతోంది. నేను మీతో టచ్ లో ఉంటాను. మీరు నా మూవీ 2 పాటలు రాయాల్సిందే " అని చెప్పారు. అలాగే నాటీ నరేష్ ఐతే బిచ్చగాడు మూవీ సీన్ ని స్పూఫ్ గా చేసేసరికి విజయ్ ఫుల్ ఫిదా ఇపోయారు.

"నరేష్ నీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. డైలాగ్స్ ని ఎంత ప్రోపర్ గా చెప్పావో చూసాను. డైలాగ్స్ ని పంక్ట్యువేషన్ (punctuation ) కి తగ్గట్టే చెప్పారు. సక్సెస్ఫుల్ యాక్టర్ కూడా మీరు. మిమ్మల్ని నేను తమిళ్ లో ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నా. నరేష్ నేను నీతో టచ్ లో ఉంటాను. ఇక్కడ ఎంత మంది టాలెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళను చెన్నైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నా.. అందరినీ నా మూవీస్ లో ఇంట్రడ్యూస్ చేద్దామనుకుంటున్న" అని చెప్పారు విజయ్ ఆంటోని.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.