English | Telugu

రాజీవ్ పంతం గెలుస్తుందా.. లేక వసుధార ప్రేమ నిలుస్తుందా!

'గుప్పెడంత మనసు' ఇప్పుడు మాటీవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్. మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో రిషిని బయటకు వెళ్ళమని చెప్తుంది. అయితే గత రెండు రోజులుగా వసుధార పెళ్ళి చుట్టూ కథ నడుస్తోంది. ఒకవైపు రిషి తన ప్రేమను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుండగా, మరో వైపు వసుధారని పెళ్ళిచేసుకోవాలని రాజీవ్ చూస్తున్నాడు. వసుధార తండ్రి చక్రపాణి తన పంతం నెగ్గించుకోవాలనుకుంటున్నాడు. దీంతో ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు ఆసక్తిని పెంచుతూ వస్తోంది.

బుధవారం జరిగిన ఎపిసోడ్ లో రిషి మాట్లాడుతూ "వసుధార.. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు. ఎవరైనా నిన్ను బెదిరిస్తున్నారా చెప్పు" అని అడుగుతాడు. దానికి వసుధార "ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ సర్. మీరు ఇక్కడ నుండి వెళ్ళండి" అని అంటుంది. దాంతో రిషి ఎమోషనల్ గా అక్కడి నుండి వెళ్లిపోతాడు. కాగా అక్కడే ఉన్న జగతి మేడం, వసుధారని తిడుతుంది. "ఏమైంది వసుధార.. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ పెళ్లి ఏంటి? రిషీతో నీ పెళ్లి గురించి మాట్లాడటానికే కదా మమ్మల్ని పిలిచావు. మరి ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావ్?" అని జగతి మేడం అడుగుతుంది. "మేడం.. మీరు కూడా ఇక్కడి నుండి వెళ్ళండి" అని అంటుంది వసుధార. అలా వసుధార మాట్లాడిన మాటలకు మహేంద్రకు కోపం వస్తుంది. "మీ శిష్యురాలు.. ది గ్రేట్ వసుధార.. యూత్ ఐకాన్.. యూనివర్సిటీ టాపర్.. నీకు మంచి గురుదక్షిణే ఇచ్చింది.మనం ఇక్కడి నుండి వెళ్లకుంటే మనల్ని మెడ పట్టుకొని గెంటేలా ఉంది. పద వెళ్దాం" అని జగతితో అంటాడు మహేంద్ర. అలా అనగానే జగతి, మహేంద్ర ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు.

ఆ తర్వాత వసుధార పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. సరిగ్గా రాజీవ్ తాళి కడుతున్న సమయానికి తన మెడలోని తాళిని బయటికి తీస్తుంది వసుధార. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత రాజీవ్ బలవంతంగా వసుధార మెడలోని తాళిని తీయడానికి ప్రయత్నిస్తాడు. ఆ తోపులాటలో వసుధార తండ్రి చక్రపాణి కిందపడిపోతాడు. దాంతో అతడి తలకు తీవ్రగాయమవుతుంది. అయిన సరే రాజీవ్ పట్టించుకోకుండా వసుధారని బలవంతం చేస్తాడు. దీంతో తనని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది వసుధార. దీంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే వసుధారని రాజీవ్ బలవంతంగా పెళ్ళి చేసుకుంటాడా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..!

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.