English | Telugu

రాత్రి 12 నుంచి న్యూ జర్నీ.. రిషిని హగ్ చేసుకున్న వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -722 లో... రిషి, వసుధారలు కాలేజీలో తమ ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. "నాకు పాత రోజులు కావాలి.. నీలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ, దాపరికాలు లేని ప్రేమ కావాలి" అని వసుధారతో రిషి అంటాడు. "మనం పాత రిషి సర్, వసుధారలు అయిపోదామా.. మన ప్రేమ, మన పరిచయం మళ్ళీ మొదలుపెడదాం. అప్పుడైనా మనం సంతోషంగా ఉంటామేమో" అని వసు అంటుంది. "బాగానే ఉంది కాని మన చుట్టూ మనల్ని చూసేవాళ్ళు ఏమనుకుంటారు.. మనల్ని అంగీకరిస్తారా" అని రిషి అంటాడు. మనం మన జర్నీని మళ్ళీ మనకోసం మొదలు పెడదాం అనుకున్నాం.. వేరే వాళ్ళ కోసం కాదని వసుధార అంటుంది. మీరు నా పాత ఎండీలాగా మారాలి అని చెప్తుంది. మన జర్నీ ఈ రాత్రి 12 గంటల నుండి మొదలు పెట్టాలని రిషి, వసుధారలు ఒక ఒప్పందానికి వస్తారు.

మరోవైపు జగతి, మహేంద్రలు కలిసి.. రిషి మన కాలేజీ పరువు కాపాడాడు. నిజంగా రిషి గ్రేట్ అంటూ ఫణీంధ్ర, దేవయానిలకు కాలేజీలో జరిగిన విషయాలు మొత్తం చెప్తారు. అంతలోనే రిషి, వసుధార ఇద్దరు కలిసి వస్తారు. "రిషి నువ్వు ఆ పేపర్స్ గురించి చాలా కష్టపడ్డావంట కదా. నాకు తెలుసు నాన్న, నువ్వు కాలేజీ కోసం ఏమైనా చేస్తావని.. అందరూ నీ గురించి గొప్పగా పొగుడుతుంటే హ్యాపీగా ఉంది నాన్న" అని దేవాయని అంటుంది. ఈ గొప్పతనం నాది కాదు వసుధారది.. తను కూడా చాలా కష్టపడిందని రిషి చెప్తాడు. సర్ నేను చేసిందేమీ లేదు.. అంత మీరే చేశారని వసుధార అనగానే.. ఎవరు గొప్పతనం ఒప్పుకోరు కదా అని ఫణింధ్ర అంటాడు. రిషి అలా వసుధారని పొగడటం దేవయానికి నచ్చదు.. దాంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

రిషి తన‌ గదిలో, వసుధార తన గదిలో ఉండి ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. 12 ఎప్పుడు అవుతుందా, న్యూ జర్నీ ఎప్పుడు మొదలు పెడదామా అన్నట్లుగా ఇద్దరు చూస్తారు. పన్నెండు అవడంతోనే ఇద్దరు ఒకేసారి హాల్లోకి వచ్చి కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఉదయం తొమ్మిది నుండి రాత్రి ఏడు వరకు పాత రిషీ వసుధారలం.. మిగతా టైంలో మాములుగా ఉందామని రిషి అంటాడు. వసుధార సరే అంటుంది. బెస్టాఫ్ లక్ అని ఇద్దరు చెప్పుకొని, రిషి వెళ్ళిపోతుండగా.. వసుధార వెనకాల నుండి వచ్చి రిషిని హగ్ చేసుకుంటుంది. ఇదేంటని రిషి అడగగా.. ప్రేమ సర్ అని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.