English | Telugu

బిగ్ బాస్ హౌస్‌లో దొంగలు పడ్డారు!

బిగ్ బాస్ హౌస్ రోజు రోజుకి కొత్త టాస్క్‌లతో అలరిస్తోంది. కాగా నిన్నటి ఎపిసోడ్‌లో హౌస్‌లోకి దొంగలు వచ్చి, కంటెస్టెంట్స్‌కి సరిపడా ఉన్నంత ఫుడ్‌ని మొత్తం తీసుకెళ్ళిపోయారు. దొంగలు వచ్చి ఫుడ్ తీసుకెళ్ళడానికి కారణం అంతకముందు మొదలైన 'సెలబ్రిటీ లీగ్ టాస్క్'. ఈ టాస్క్‌లో ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్కో సెలబ్రిటీ పాత్ర ఇచ్చి, ఆ పాత్రలోనే టాస్క్ సమయం ముగిసేవరకు ఉండాలని బిగ్ బాస్ చెప్పగా, ఎవరు కూడా ఆశించినంతగా పర్ఫామెన్స్ ఇవ్వకపోవడంతో బిగ్ బాస్ కి కోపం‌ వచ్చి, అందరిని వెళ్ళిపోమని చెప్పిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో దొంగలు వచ్చి ఫుడ్ తీసుకెళ్ళారు. "ఎప్పుడు అయితే కంటెస్టెంట్స్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పిస్తారో అప్పుడే ఫుడ్ వస్తుంది" అని చెప్పాడు బిగ్ బాస్. ప్రేక్షకులు మాత్రం ఎంటర్టైన్మెంట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే నెటిజన్లు మాత్రం తమకు నచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నారు.

"తిండి దండగ అని సింబాలిక్ గా చెప్తున్నాడు బిగ్ బాస్" అని ఒకరు, "ఇది కదా కావాల్సింది. ఫుడ్ కోసం వాళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు నిజమైన గేమ్ ఆడుతున్నారు." అని ఇలా నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా ఫుడ్ కోసం అయినా కంటెస్టెంట్స్‌ పర్ఫామెన్స్ చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తారో? లేదో? చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.