English | Telugu

కనకం గాలిమేడలు రుద్రాణి కూల్చనుందా!

స్టార్ మాలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్-11లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో కృష్ణమూర్తికి రాజ్ వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాన్ని అప్పు చెప్తుంది. మన స్థాయిలో సంబంధం చూసుకోవాలి కానీ గాల్లో మేడలు కట్టొద్దని కృష్ణమూర్తి అంటాడు. మనలాగే మన పిల్లలు బ్రతకడం నాకు ఇష్టం లేదు, వాళ్ళకి మంచి జీవితం ఇస్తాను.. నేను ఎవరు చెప్పినా వినదలుచుకోలేదని అంటుంది కనకం.

మన గురించి వాళ్ళకి చెప్పావా అని అడుగుతుంది కావ్య. "చెప్పలేదు.. ఎక్కడ మనం ధనవంతులం కాదని తెలిస్తే దగ్గరికి కూడా రానివ్వరని.. వాళ్ళకి మనం ధనవంతులం అనే చెప్పినా" అని అంటుంది కనకం. "ఒక వేళ మనం వాళ్ళ స్థాయి వాళ్ళం కాదని తెలిస్తే.. అక్క పరిస్థితి ఆలోచించావా" అని అడుగుతుంది కావ్య. అవన్నీ నేను చూసుకుంటా అంటూ.. "కొంపదీసి మనం పేదవాళ్ళమని చెప్పేలా ఉన్నావ్.. నువ్వు అలా చెప్తే నా మీద ఒట్టే" అని కనకం తన మీద ఒట్టేసుకుంటుంది. మరొక వైపు రాజ్ ఇంట్లో అందరు.. "నీ కలల స్వప్న సుందరి గురించి ఆలోచిస్తున్నావా" అంటూ రాజ్ ని ఆటపట్టిస్తారు. రాజ్ కి స్వప్న అంటే ఇష్టమని వాళ్ళ అమ్మకు చెప్పడంతో.. ఆమె హ్యాపీ గా ఫీల్ అవుతుంది. రుద్రాణి మాత్రం.. మీరందరు అనుకుంటున్నట్టు వాళ్ళు కోటీశ్వరులు కాదు. నేను అనుకున్నది జరగాలంటే ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని అనుకుంటుంది.

స్వప్న కావాలనే తన చెవి కమ్మ రాజ్ ఇంట్లో వదిలేసి ఆ వంక తో మళ్ళీ రెడీ అయి రాజ్ ఇంటికి వెళ్తుంది. అయితే స్వప్న ఫోన్ మర్చిపోవడం చూసిన కావ్య, అప్పులు.. "స్వప్న అక్కడ ఏమైనా ఇబ్బంది పడుతుందేమో" అని అనుకొని ఫోన్ స్వప్నకి ఇవ్వాలని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.