English | Telugu

'వైదేహీ పరిణయం' హీరోయిన్ బ్యాగ్రౌండ్ ఇదే!

అందం, అమాయకత్వం కలగలిపిన అమ్మాయి వైదేహిగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యుక్తా మల్నాడ్ ఉంది చూశారా? అదేనండీ... 'జీ తెలుగు'లో ప్రసారం అవుతున్న 'వైదేహీ పరిణయం' సీరియల్‌లో వైదేహిగా నటిస్తున్న అమ్మాయి. నటనపై ఆసక్తితో విమానంలో ఉద్యోగాన్ని వదిలేసి మరీ వచ్చింది. ఇంతకీ, యుక్తా మల్నాడ్ ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...

బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటున్న యుక్తా మల్నాడ్ తెలుగమ్మాయి కాదు. పేరులోని చివరి అక్షరాలు 'మల్నాడ్' ఆమె ఇంటి పేరు కూడా కాదు. యుక్తాది కర్ణాటకలోని చిక్ మంగళూరు. బీకామ్ చదివింది. డిగ్రీ చదివేటప్పుడు అందాల పోటీల్లో పాల్గొనేది. 2015లో 'మిస్ మల్నాడ్' టైటిల్ గెలుచుకుంది. అందుకు గుర్తుగా పేరు చివర 'మల్నాడ్' అని పెట్టుకుంది.

కాలేజీలో ఉండగా కన్నడ సినిమా 'అనిసుతిదే'లో అవకాశం వస్తే నటించింది. కానీ, అది విడుదల కాలేదు. డిగ్రీ తర్వాత ఎయిర్ హోస్టెస్ గా చేసే అవకాశం వస్తే 'స్పైస్ జెట్'లో చేరింది. నటనపై ఆసక్తితో రెండు మూడు నెలలు తిరక్కుండా మానేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కొన్నాళ్ళు పని చేసింది. కన్నడ సీరియల్‌లో నటించాలని ఆడిషన్స్ ఇస్తే... తొలుత తమిళ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. అదెలా? అంటే... కన్నడ సీరియల్‌కి పని చేసే వ్యక్తి ఒకరు తమిళంలో చేస్తావా? అని అడగటంతో చేసేసింది. తర్వాత తెలుగులో 'వైదేహీ పరిణయం'లో అవకాశం వచ్చింది.

నిజానికి, తెలుగులో సినిమా కథానాయికగా అడుగుపెట్టాలని యుక్తా మల్నాడ్ భావించింది. తలుపు తట్టిన మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని సీరియల్ చేశానని ఆమె చెప్పింది. అదీ సంగతి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.