English | Telugu

కోడలికి కడుపు లేదని అందరికి  తెలిసిపోయింది.. తప్పుని చెల్లి మీదకి తోసేసిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్- 242 లో... స్వప్న ఫ్రెండ్ రియాని బెదిరిస్తుంది రుద్రాణి. ఏం కావాలండి మీకు అని రియా అనగా.. ఏం చేయాలని అడుగు అని రుద్రాణి అంటుంది. స్వప్నకి కడుపు లేదని ఇప్పుడు మా ఇంటికి వచ్చి అందరి ముందు చెప్పాలని రుద్రాణి అనగా.. వద్దని స్వప్నకి చెప్పాను కానీ వినకుండా స్వప్నే బలవంతం చేసిందని రియా అంటుంది. నిన్ను డాక్టర్ వృత్తికి దూరం చేస్తానని, పది నిమిషాల్లో ఇక్కడ ఉండాలని రుద్రాణి అనగానే.. సరేనంటుంది రియా. ఇక అందరి మోహాలు ఎలా ఉంటాయో చూడాలని రుద్రాణి అనగా.‌ అందరి గురించి ఎందుకు అమ్మ, స్వప్న ఇంట్లో నుండి తరిమేస్తే చాలు మన దరిద్రం మొత్తం పోతుందని రాహుల్ అంటాడు.

మరొకవైపు స్వప్నకి శ్రీమంతం గ్రాంఢ్ గా జరిపిస్తుంటారు. ఇక డాడీ కాల్ చేసారు వెళ్ళాలని అనామిక వెళ్ళిపోతుంది. నా కూతురు శ్రీమంతం ఇంత ఘనంగా జరుగుతుంటే ఆ సంతోషం తట్టుకోలేకపోతున్నాని కనకం అనగానే.. ఇవేం చూసావ్ కనకం, ఇంకాసేపట్లో నేను ఇవ్వబోయే గిఫ్ట్ చూస్తే ఏకంగా కళ్ళు తిరిగి పడిపోతావని రుద్రాణి‌ అంటుంది. ఇక అప్పడే రియా రావడంతో.. స్వప్న నీ శ్రీమంతానికి ఎవరొచ్చారో చూడమని రుద్రాణి అంటుంది. ఇక రియాని చూసిన స్వప్న షాక్ అవుతుంది. ఈ డాక్టర్ నీ ఫ్రెండే కదా అని రుద్రాణి అనగానే.. గెస్ట్ గా వచ్చిన డాక్టర్ ని చెకప్ చేయమంటావేంటని అపర్ణ అంటుంది. కోడలా కోడలా కొడుకు పెళ్ళామా దర్జాగా కూర్చుంది చాలు ఇక లేవవే అని స్వప్నని రుద్రాణి అనగానే.. అది విని ఇంట్లోని వాళ్ళంతా షాక్ అవుతారు.

ఇన్ని రోజులు తనకి కడుపు ఉందని, ఈ స్వప్న మనల్ని నమ్మించి, భ్రమలో ఉంచి మనల్ని మోసం చేసింది. నన్ను నా కొడుకుని నిలువాలా ముంచేసి ఎంత నిజం దాచిందో చూశారా అని రుద్రాణి చెప్తుంది. ఏంటే ఇది అని స్వప్నని కనకం నిలదీస్తుంది. శ్రీమంతం దాకా వచ్చేదాకా, నువ్వే ఈ నాటకం ఎందుకు కొనసాగించావ్? ఛీ ఇంత మోసమా? ఇంత పెద్ద అబద్దామా అని కనక‌ం ఏడుస్తుంది‌. అబద్ధం నీ రక్తంలోనే ఉంది. మోసం నీ పెంపకంలోనే ఉందని రుద్రాణి అంటుంది. ఇక రాహుల్ స్టేజ్ మీద నుండి కిందకి లాక్కొచ్చి.‌. ఏంటే ఇది, ఈ నిజం ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదని అడుగుతాడు. నేను తండ్రిని కాబోతున్నానే సంతోషం ఎందుకు లేకుండా చేశావని నిలదీస్తాడు.

ఇక అందరు కలిసి కనకంని తిడతారు. ఇంత చేసిన ఈ తల్లి గాని తల్లి నాకెప్పటికీ కోడలు కాలేదని స్వప్నని రుద్రాణి తిడుతుంది. ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోతే ఇక జీవితంలో నన్ను ఇంట్లోకి రానివ్వరని, ఏదో ఒకటి చేసి ఉండిపోవాలని అనుకుంటుంది స్వప్న. ఏం చెయ్యాలని స్వప్న అనుకుంటుంది. ఇక రాహుల్, రుద్రాణి కలిసి స్వప్నని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తుండగా.. వదలండి నన్ను అని గట్టిగా అరుస్తుంది స్వప్న. " కావ్య.. రావే, ఇంత జరుగుతుంటే ఇంకా నోరు విప్పకుండా అలాగే చూస్తున్నావేంటే? నా భర్త, నా అత్త నన్ను గెంటేస్తుంటే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావంటే? నీ మాట నమ్మి నేను ఇంతదాకా తెచ్చుకుంటే ఏం పట్టనట్టు వినోదం చూస్తున్నావేంటే? నిజం ఏంటో చెప్పు కావ్య" అని స్వప్న అడుగుతుంది.

ఏంటీ కొత్త నాటకం, నీ తప్పుకి కళావతికి మధ్య సంబంధం ఏంటని రాజ్ అడుగగా.. ఉందని స్వప్న అంటుంది‌. నేను కడుపుతో ఉన్నట్టు సలహా చెప్పిందే ఈ కావ్య అని స్వప్న అంటుంది. ‌ఇక అందరు షాక్ అవుతారు. స్వప్న కళావతికి తప్పు చేయాల్సిన అవసరం లేదని రాజ్ అనగా.. " లేదు రాజ్, రాహుల్ నన్ను మోసం చేసి ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నాడని తెలిసి నేను చచ్చిపోవాలనుకున్నాను. అప్పుడు కావ్యే కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్తే రాహుల్ తో నీ పెళ్ళి జరుగుతుందని సలహా ఇచ్చిందని అందుకనే అబద్ధం చెప్పాల్సి వచ్చింది" అని స్వప్న అంటుంది. అక్క చెల్లెళ్ళు కలిసే ఈ నాటకం ఆడుతున్నారా అని రుద్రాణి అనగా.. " నా పెద్ద కూతురు అవకాశవాది అమ్మ. దాని సంతోషం కోసం, సుఖం కోసం ఎంతకైనా దిగజారుతుంది కానీ కావ్య అలా కాదమ్మ, ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ఎవ్వరిని మోసం చేయదు" అని కృష్ణమూర్తి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.