English | Telugu
పిల్లల్ని కనడం పెద్ద టాస్క్.. వెటకారంగా మాట్లాడకండి!
Updated : Nov 1, 2023
సింగర్ గీతామాధురి చాలా బాధపడుతోంది. ఆమె గురించి ఆమె పాటలే చెప్తాయి. ఆమె గొంతుకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. గీతా మాధురి కెరీర్ లోనూ బిజీగా ఉంది. అటు సినిమాల్లో పాటలు పాడుతునే... బుల్లితెరపై ప్రసారమవుతున్న షోస్ కి మెంటర్ గా కూడా వ్యవహారిస్తుంది. అలాంటి గీత రీసెంట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో తన ఆవేదన అంతా వెళ్లగక్కింది. నటుడు నందుని లవ్ మ్యారేజ్ చేసుకున్న గీతా మాధురికి ఒక కూతురు ఉంది. ఇంత హ్యాపీగా వీళ్ళ ఫామిలీలో గొడవలు జరుగుతున్నాయని...త్వరలో నందు, గీత విడిపోతున్నారంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాళ్ళు కలిసి ఉన్నప్పటికీ ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ మాత్రం పడడం లేదు.
నందు ఆల్రెడీ సోషల్ మీడియాలో తామిద్దరం బాగున్నామని చెప్పాడు. ఇక ఇప్పుడు గీతా మాధురి రిలీజ్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉన్న జంటలపై సొసైటీ కన్సర్న్ వలన చాలా స్ట్రెస్ పడుతోందని చెప్పుకొచ్చింది."అవును!! నిజం!! ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్న తరంలో, జీవనశైలి, ఆహారనాణ్యత, పని సమయాలు, ఒత్తిడి, వాతావరణ మార్పులు, కాలుష్యంలో వస్తున్న మార్పుల కారణంగా బాడీలో కూడా చేంజెస్ వచ్చేస్తున్నాయి.
కాబట్టి పిల్లల్ని కనడం అనేది ఈరోజుల్లో పెద్ద టాస్క్ లా మారిపోయింది. నేను పెళ్ళై ఇంకా పిల్లలు పుట్టని ఐదు జంటలతో మాట్లాడాను. వాళ్లు చాలా స్ట్రెస్ లో ఉన్నారు. దానికి తోడు వాళ్ళ మీద సోసైటీ ప్రెజర్. సోసైటికీ అంత కన్సర్న్ ఉంటే.. వెటకారంగా మాట్లాడకండి.. యే మీకు పిల్లలు లేరా.. ఇంకా ఎప్పుడు కంటారు.. ఎప్పుడు డబ్బు సంపాదనేనా.. పిల్లలు కనండి, డాక్టర్స్ కి చూపించుకోండి..ఇలా అంటారు. ఇవన్నీ వాళ్లకు తెలీదా. ఈ ప్రశ్నల వలన జంటలపై ప్రెజర్ పడుతుంది. చుట్టాలు, సోసైటీ కపూల్స్ ను కంగారు పెడుతుంటారు. ఇలాంటి జంటలకు నేను చెప్పేది ఏంటంటే సోసైటీ ప్రెజర్ లో పడి.. మీరు ఒత్తిడికి లోను కాకండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అందరూ అడిగే వాళ్లు జాగ్రత్తగా మాట్లాడండి. నాకు ఎందుకో చెప్పాలి అనిపించింది.." అంటూ తన మనసులో బాధను చెప్పకనే చెప్పింది గీతామాధురి.