English | Telugu

భ‌ర్త మ‌ర‌ణాన్ని త‌ల‌చుకొని భోరుమ‌న్న‌ సురేఖావాణి!

బుల్లితెర నటిగా కెరీర్ ఆరంభించి ఆ తరువాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పాపులారిటీ సంపాదించుకున్నారు నటి సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో నటించిన సురేఖ తనదైన అభిన‌యంతో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తన కూతురు సుప్రీతతో కలిసి తీసుకున్న ఫోటోలను, డాన్స్ వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఈమె తన స్నేహితురాలు నటి రజితతో కలిసి 'అలీతో సరదాగా' షోకి అతిథిగా హాజరయ్యారు.

ఈ షోలో తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను సురేఖా వాణి బయటపెట్టారు. అంతేకాకుండా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సురేష్ మృతి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కొన్ని అపార్ధాలు, మనస్పర్థల కారణంగా తన అత్తింటి కుటుంబం తమకు దూరంగా ఉంటోంద‌ని.. క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాళ్లు ఒక్క రూపాయి సాయం చేయలేదని వాపోయారు. తన కూతురు, తనే అన్నీ సమకూర్చుకున్నామని.. అయినప్పటికీ తనను, తన కూతుర్ని వాళ్లు నిందించారని.. తన భర్త మృతి విషయంలో తనదే తప్పంటూ బ్లేమ్ చేశారని చెప్పుకొచ్చారు.

తన భర్త చనిపోయినప్పుడు.. కనీసం అతడి తల్లి కానీ, అన్నదమ్ములు కానీ చూడడానికి రాలేదని తెలిపారు. కనీసం ఈ ప్రోగ్రాం చూశాకైనా.. వాళ్లు సిగ్గు తెచ్చుకోవాలని మండిపడ్డారు. అనంతరం తన భర్త మరణం గురించి మాట్లాడుతూ.. శరీరంలో రక్తం గడ్డ కట్టడంతో ఓ సర్జరీ చేయించామని.. అది జరిగిన నెల రోజులకే ఆయన కన్నుమూశారని గుర్తు చేసుకుంటూ ఏడ్చేశారు. ఇక తన రెండో పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఏదేదో రాస్తున్నారని.. వాళ్లనే పెళ్లి సంబంధాలు కూడా చూడమని చెప్పానని వ్యంగ్యంగా మాట్లాడారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.